Politics:కాంగ్రెస్ లేకపోతే కూటమి అసంపూర్ణమే
జాతీయ స్థాయిలో విపక్షాలన్నీ కలిసి కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, అందులో కాంగ్రెస్ భాగస్వామ్యం లేకపోతే అది సంపూర్ణం కాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో...
సంజయ్ రౌత్
దిల్లీ: జాతీయ స్థాయిలో విపక్షాలన్నీ కలిసి కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, అందులో కాంగ్రెస్ భాగస్వామ్యం లేకపోతే అది సంపూర్ణం కాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార భాజపాకు సరైన ప్రత్యామ్నాయంగా నిలవాలంటే కూటమిలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని అయన అభిప్రాయపడ్డారు. దిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో తృణమూల్, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ఆద్మీ, ఆర్ఎల్డీ, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన కీలక నేతలు శుక్రవారం సమావేశమైన సంగతి తెలిసిందే. దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను గురించి చర్చించినట్లు సమావేశ అనంతరం వెల్లడించారు. ఈ భేటీపై భారీ ఊహాగానాలు చెలరేగాయి. భాజపాకు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ కీలక సమావేశానికి కాంగ్రెస్తోపాటు వైకాపా, తెదేపా నేతలు హాజరు కాలేదు.
ఈ అంశంపై తాజాగా సంజయ్ రౌత్ స్పందించారు. ‘‘ దేశంలో మూడో కూటమి, ఇతర ఏ కూటమి అవసరం లేదు. శరద్ పవార్ కూడా ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ‘సామ్నా’ పత్రిక ఇదే విషయాన్ని చెప్పింది. మరోవైపు కాంగ్రెస్ ఆలోచన కూడా అదే. భాజపాకు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమిలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ భవిష్యత్ కోసం పటిష్ఠమైన ప్రతిపక్షం అవసరం. విపక్ష పార్టీలన్నింటినీ ఒక తాటిమీదకు తెచ్చేందుకు కసరత్తు జరుగుతున్నా... కాంగ్రెస్ లేకపోతే అది సంపూర్ణం కాదు’’ అని రౌత్ వెల్లడించారు.
శుక్రవారం సమావేశం ముగిసిన తర్వాత శరద్ పవార్ మాట్లాడుతూ.. కూటమి ఏర్పాటుపై చర్చించ లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఒక వేళ అలాంటి పరిస్థితులు ఎదురైతే సమష్టిగా నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు సమావేశం జరిగిన తర్వాత రోజున మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే స్పందిస్తూ కాంగ్రెస్ లేకుండా భాజపాకు వ్యతిరేకంగా ఏ కూటమి ఏర్పాటైనా అది కాషాయ పార్టీకి మేలే చేస్తుందని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ల కోలాహలం షురూ
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల కోలాహలం ప్రారంభమైంది. రాజకీయ సందడి ఊపందుకుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికల అధికారులు గురువారం ఉదయం నోటిఫికేషన్లు జారీ చేశారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం
వచ్చే సంవత్సర కాలంలో ఏదైనా జరగొచ్చని, లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా అభివృద్ధి చేశా
ఓటు వేసి గెలిపించిన ఓటరు తలదించుకునేలా తాను ఏ రోజూ వ్యవహరించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని కోరారు. -
పదేళ్లలో రాష్ట్రానికి భారాస, భాజపా చేసింది శూన్యం
గత పదేళ్లలో రాష్ట్రంలోని భారాస, కేంద్రంలోని భాజపా ప్రభుత్వాలు తెలంగాణకు చేసింది శూన్యమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. -
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
ఇటీవల తన తల్లి మృతి నేపథ్యంలో హమీర్పుర్ సీటు తనకు ఇచ్చినా పోటీ చేసే ఉద్దేశం లేదని డిప్యూటీ సీఎం కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె