మా పార్టీనే మాకు కుటుంబం: నడ్డా

బిహార్‌ ప్రజలు గూండారాజ్‌ను తిరస్కరించి అభివృద్ధికి ఓట్లు వేశారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. గురువారం ఆయన ఒడిశాలో 2018 ఆగస్టు 5న శంకుస్థాపన చేసిన ఆరు భాజపా కార్యాలయాలను ప్రారంభించారు. ..........

Published : 18 Nov 2020 00:59 IST

భువనేశ్వర్‌: బిహార్‌ ప్రజలు గూండారాజ్‌ను తిరస్కరించి అభివృద్ధికి ఓట్లు వేశారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. గురువారం ఆయన ఒడిశాలో 2018 ఆగస్టు 5న శంకుస్థాపన చేసిన ఆరు భాజపా కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అభివృద్ధి అజెండాకు బిహార్‌ ప్రజలు ఆముద ముద్ర వేశారన్నారు. నరేంద్ర మోదీ విధానమైన సబ్‌కా సాత్‌ - సబ్‌కా వికాస్‌కు గట్టి మద్దతు తెలిపారన్నారు.

మంగళవారం ఆరు కార్యాలయాలను ప్రారంభించిన ఆయన.. నిర్మాణంలో ఉన్న మరో ఆరు భాజపా కార్యాలయాలను త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలిపారు. తమ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కొన్ని పార్టీలు ఇంటి నుంచే కార్యాలయాలు నిర్వహిస్తూ.. కుటుంబ పార్టీలుగా మారాయంటూ కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. తమకు మాత్రం పార్టీయే కుటుంబమన్నారు. 

2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత దేశ వ్యాప్తంగా 700 పార్టీ కార్యాలయాలు నిర్మించాలని ప్రతిష్ఠాత్మకంగా ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే 400  కార్యాలయాలు సిద్ధమయ్యాయయనీ.. మరో 200 కార్యాలయాల నిర్మాణ పనులు జరుగుతున్నట్టు చెప్పారు. మిగతా కార్యాలయాల నిర్మాణానికి భూ సేకరణ ప్రక్రియ జరుగుగుతున్నట్టు వివరించారు. క్యాడర్‌కు తగిన శిక్షణ ఇచ్చేందుకు కార్యాలయాలే తగిన చోటు అని ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని