హుజూరాబాద్ తెరాస టికెట్ నాదే: కౌశిక్రెడ్డి
మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో త్వరలో
కార్యకర్తతో కాంగ్రెస్ నేత ఫోన్ సంభాషణ
హుజూరాబాద్: మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికపై రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్, టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్రెడ్డి ఓ కార్యకర్తతో ఫోన్లో జరిపిన సంభాషణ బయటకొచ్చింది. మాదన్నపేటకు చెందిన విజేందర్ అనే కార్యకర్తతో కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. హుజూరాబాద్ తెరాస టికెట్ తనకే ఖాయమైనట్లు చెప్పారు. యువతకు ఎంత డబ్బు కావాలో తాను చూసుకుంటానని.. ప్రస్తుతం వారి ఖర్చులకు ఒక్కొక్కరికీ రూ.4-5వేలు ఇస్తానని అతడికి తెలిపారు. ఈ విషయంపై కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రాజిరెడ్డిని కలవాలని విజేందర్కు కౌశిక్రెడ్డి సూచించారు. ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ను కౌశిక్రెడ్డి కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన జరిపిన ఫోన్ సంభాషణ బయటకు రావడంపై ప్రాధాన్యత సంతరించుకుంది.
కౌశిక్రెడ్డికి కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు
తెరాస టికెట్ తనకే ఖాయమైందంటూ కౌశిక్రెడ్డి ఫోన్ సంభాషణ బయటకొచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గత కొంతకాలంగా కౌశిక్రెడ్డి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ తెరాస నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్లు ఫిర్యాదులందాయని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. కౌశిక్రెడ్డిని పిలిచి ఈ విషయంపై గతంలో హెచ్చరించినా అతనిలో మార్పురాలేదన్నారు. తాజా ఫోన్ సంభాషణపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని.. లేని పక్షంలో ఆయనపై చర్యలు తీసుకోనున్నట్లు షోకాజ్ నోటీసులో పేర్కొన్నామని కోదండరెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!