Ljp: ఆయన్ను కేంద్రమంత్రిని చేస్తే..కోర్టుకు వెళ్తాం
ఎల్జేపీ చీలిక వర్గం నేత పశుపతి పరాస్కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే వార్తలపై ఆ పార్టీ నేత చిరాగ్ పాసవాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిరాగ్ పాసవాన్ ఆగ్రహం
దిల్లీ: ఎల్జేపీ చీలిక వర్గం నేత పశుపతి పరాస్కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే వార్తలపై ఆ పార్టీ నేత చిరాగ్ పాసవాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరాస్ ఎల్జేపీలో భాగం కానందున.. పార్టీ కోటా కింద ఆయన కేంద్రమంత్రిగా నియమితులు కాలేరని చిరాగ్ వ్యాఖ్యానించారు. ‘మా పార్టీతో ప్రమేయం లేకుండా ఆయన్ను స్వతంత్రంగా మంత్రిని చేసుకోవచ్చు. ఎల్జేపీ కోటా కింద మంత్రిని చేస్తే..దాన్ని మేం కచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఆ నియామకంపై కోర్టుకు వెళ్తాం’ అని చిరాగ్ మంగళవారం మీడియాకు వెల్లడించారు.
కేంద్ర మంత్రివర్గ విస్తరణకు మోదీ సర్కారు ఈ నెల 8వ తేదీన ముహూర్తం ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రివర్గంలో భాగం కానున్నారని భావిస్తున్న పలువురు నేతలు ఇప్పటికే దిల్లీకి పయమనమయ్యారు. ఈ క్రమంలోనే చిరాగ్ స్పందన వెలువడింది. దళిత నేత, దివంగత రామ్ విలాస్ పాసవాన్ నెలకొల్పిన ఎల్జేపీలో కొద్ది వారాల కిందట తిరుగుబాటు జెండా ఎగిరిన సంగతి తెలిసిందే. పాసవాన్ తమ్ముడు పశుపతి ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించి, పార్టీని చీల్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని