Rahul Gandhi: మోదీపై ఆరోపణలు.. రాహుల్ గాంధీపై చర్యలకు భాజపా డిమాండ్..!
ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలపై భాజపా మండిపడుతోంది. మోదీపై (Narendra Modi) నిరాధార ఆరోపణలు చేయడంతోపాటు లోక్సభను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ రాహుల్పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను డిమాండ్ చేసింది.
దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై (Narendra Modi) లోక్సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలపై భాజపా మండిపడింది. ఆ అభ్యంతరకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరింది. మంగళవారం జరిగిన ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన భాజపా.. బుధవారం సభ మొదలు కాగానే రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రితో పాటు భాజపా ఎంపీలు లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు.
‘కాంగ్రెస్ నేత కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి అత్యంత అభ్యంతరకర, నిరాధార ఆరోపణలు. వాటిని తొలగించడంతోపాటు ఆయనపై చర్యలు తీసుకోవాలి’ అని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. దీనిపై సభాహక్కుల తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. ఎవరైనా ఆరోపణలు చేయాలనుకుంటే ముందుగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
మరోవైపు మోదీపై నిరాధార ఆరోపణలు చేయడంతోపాటు సభను తప్పుదోవ పట్టించినందుకు రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలంటూ భాజపా ఎంపీ నిశికాంత్ దుబే స్పీకర్కు లేఖ రాశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. సభా గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారని అందులో పేర్కొన్నారు. అయితే, భాజపా నేతలు, మంత్రి చేసిన డిమాండ్లపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తక్షణం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వీటిని పరిశీలిస్తానని.. అనంతరం నిర్ణయిం తీసుకుంటానని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?