Pawan Kalyan: ఉగ్రవాద పార్టీకి సలహాదారుగా సజ్జల: పవన్ కల్యాణ్
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు డ్యాం కొట్టుకుపోయిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఉగ్రవాద పార్టీకి సలహాదారుగా ఉంటూ.. రాయలసీమకు చెడ్డపేరు తీసుకొస్తున్నారని విమర్శించారు.
మంగళగరి: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన ఇసుక తవ్వకాల వల్లే అన్నమయ్య ప్రాజెక్టు డ్యామ్ కొట్టుకుపోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ ప్రమాదంలో వందలాది పశువులు ప్రాణాలు కోల్పోయాయన్నారు. నాడు లష్కర్ రామయ్య అనే ఉద్యోగి అక్కడ లేకపోతే మరింత ప్రాణనష్టం జరిగి ఉండేదన్నారు. దాదాపు 200 మంది ప్రాణాలను ఆయన కాపాడారని చెప్పారు. ఆయన కృషిని జనసేన మనస్ఫూర్తిగా అభినందిస్తోందని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులతో మంగళగిరిలో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. విపత్తు నిర్వహణ సంస్థ చేయాల్సిన పనిని రామయ్య చేశారని కొనియాడారు.
సజ్జల రామకృష్ణారెడ్డి ఉగ్రవాద పార్టీకి సలహాదారుగా ఉన్నారని పవన్ విమర్శించారు. రాయలసీమకు ఆయన చెడ్డపేరు తీసుకొస్తున్నారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో చెట్లను విపరీతంగా నరికేస్తున్నారని, అలాంటి వారంతా గరుడపురాణం చదవాలని పవన్ అన్నారు. వైకాపా బాధ్యతా రాహిత్యం వల్లే డ్యామ్ కొట్టుకుపోయిందని దుయ్యబట్టారు. జనసేన రౌడీ సేన కాదని, విప్లవ సేన అని పవన్ పేర్కొన్నారు. అన్నమయ్య డ్యామ్ బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు వంశీకృష్ణ అనే జాతీయస్థాయి క్రీడాకారుడు నష్టపోతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామన్నారు.
గత ఏడాది నవంబరులో విస్తారంగా కురిసిన వర్షాలతో అన్నమయ్య, పింఛ జలాశయాల వద్ద కట్టలు తెగిపోయి పెను విధ్వంసం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో యంత్రాంగం వ్యవహరించిన తీరుపై అప్పట్లో తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఊళ్లకు ఊళ్లు మునిగిపోగా.. ప్రాణనష్టమూ సంభవించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
NDA: ఎన్డీఏ ‘మహా’ వ్యూహం.. ఉద్ధవ్కు చెక్ పెట్టేందుకు రంగంలోకి రాజ్..!
మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి వేగంగా పావులు కదుపుతోంది. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. -
Sita Soren: జేఎంఎంకు షాక్..! భాజపాలోకి శిబూ సోరెన్ పెద్ద కోడలు
జేఎంఎం అధినేత శిబూ సోరెన్ పెద్ద కోడలు, ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ మంగళవారం భాజపాలో చేరారు. -
AP News: ఈ ఎన్నికల్లో జగన్కు తగిన బుద్ధి చెప్తాం: మందకృష్ణ మాదిగ
ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో మాదిగలకు సంక్షేమం లేకుండా చేసిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. -
Harish Rao: ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇవ్వాలి: హరీశ్రావు
అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని భారాస (BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) డిమాండ్ చేశారు. -
Mallikarjun Kharge: భాజపా హామీలు.. 2004 ఫలితమే వస్తుంది: ఖర్గే
భాజపా ఇచ్చిన హామీలకు 2004 ఫలితాలే పునరావృతం అవుతాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. -
YSRCP: చిలకలూరిపేట పంచాయితీ.. మల్లెల రాజేశ్కు సీఎంవో నుంచి పిలుపు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైకాపా (YSRCP) పంచాయితీ తాడేపల్లికి చేరింది. అక్కడి వైకాపా నేత మల్లెల రాజేశ్ నాయుడుకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. -
AP News: కాంగ్రెస్లో చేరిన వైకాపా ఎమ్మెల్యే
నందికొట్కూరు వైకాపా ఎమ్మెల్యే ఆర్ధర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
Pashupati Paras: అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్ రాజీనామా
Pashupati Paras: కేంద్రమంత్రి పశుపతి కుమార్ పరాస్ తన పదవికి రాజీనామా చేశారు. బిహార్లో చిరాగ్ పాసవాన్కు చెందిన ఎల్జేపీ (రాంవిలాస్)తో భాజపా పొత్తు పెట్టుకోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. -
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?
తెదేపా (TDP) ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) కసరత్తు చేస్తున్నారు. -
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరు వైకాపా నేతలపై పోలీసులు సోమవారం కేసులు నమోదు చేశారు. -
సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ
ప్రజలతో మమేకమయ్యేందుకు తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ ఆ పార్టీ అభ్యర్థి లోకేశ్ సోమవారం ‘రచ్చబండ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ప్రధాని సభలో ఇంత భద్రతా వైఫల్యమా?
‘ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పాల్గొన్న ప్రజాగళం బహిరంగ సభలో అడుగడుగునా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. సభలో ఎక్కడా ప్రజలను నియంత్రించే ప్రయత్నం చేయలేదు. -
జనం తోసుకుంటుంటే చోద్యం చూశారు
ప్రధాని మోదీ పాల్గొన్న బొప్పూడి ప్రజాగళం సభకు భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ధ్వజమెత్తారు. -
ప్రభుత్వ వెబ్సైట్లలో ఫొటోలు తొలగించాలి
ప్రభుత్వశాఖల వెబ్సైట్లలో ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు ఉండడంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ)కి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. -
ప్రధాని సభకు ఆటంకాల వెనుక జగన్ హస్తం
ప్రధానమంత్రి పాల్గొన్న ప్రజాగళం సభకు ఆటంకాలు సృష్టించడం వెనుక ముఖ్యమంత్రి జగన్ హస్తం ఉందని మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. -
లక్షల మంది తరలివచ్చి కూటమిని ఆశీర్వదించారు
చిలకలూరిపేటలో భాజపా, తెదేపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ వంటిది ఈ దశాబ్దంలో చూడలేదని జనం చెబుతున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపు చేపడితే మేలు
ఏపీలో మే 13న ఎన్నికలు ముగిశాక సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపును చేపట్టాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. -
జగన్ అరాచక పాలనకు మోదీ అండ: సీపీఐ
వైఎస్ వివేకా హత్య కేసు నిందితులను సీబీఐ ఇంతవరకు గుర్తించకపోవడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. -
కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్ యథావిధిగా జరుగుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. -
వైకాపా అధిష్ఠానానికి నగరి అసమ్మతి నేతల ఝలక్
చిత్తూరు జిల్లా నగరి సీటును మంత్రి రోజాకు కేటాయిస్తే తాము పని చేయమని వైకాపా అసమ్మతి నేతలు తెగేసి చెప్పినా, రెండ్రోజుల క్రితం ఆమె అభ్యర్థిత్వాన్నే జగన్ ఖరారు చేశారు. -
కడపలోనూ కొండలు కొల్లగొట్టేశారు...
ముఖ్యమంత్రి జగన్ సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో కొండలు, గుట్టలను వైకాపా నేతలు అయిదేళ్లుగా వరుసబెట్టి మింగేశారు.
తాజా వార్తలు (Latest News)
-
NDA: ఎన్డీఏ ‘మహా’ వ్యూహం.. ఉద్ధవ్కు చెక్ పెట్టేందుకు రంగంలోకి రాజ్..!
-
Stock market: భారీ నష్టాల్లో సూచీలు.. సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్
-
India- China: ఎన్నిసార్లు వాదించినా వాస్తవాలు మారవు.. చైనాకు భారత్ కౌంటర్
-
CAA: సీఏఏపై స్టే కోరుతూ పిటిషన్లు.. కేంద్రానికి మూడు వారాల గడువిచ్చిన సుప్రీం
-
Sita Soren: జేఎంఎంకు షాక్..! భాజపాలోకి శిబూ సోరెన్ పెద్ద కోడలు
-
Mumbai Indians: హార్దిక్.. అంత వీజీ కాదు