Pawan Kalyan: వ్యక్తిగత దూషణలకు దిగితే ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు: పవన్
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సంక్షోభానికి వైకాపా అనాలోచిత విధానాలే కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.
హైదరాబాద్: వైకాపా ప్రభుత్వ లోపభూయిష్ట నిర్ణయాలు, అనాలోచిత విధానాలే రాష్ట్రంలో విద్యుత్సంక్షోభానికి కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. పల్లెల్లో 11 నుంచి 14 గంటలు, పట్టణాల్లో 5 నుంచి 8గంటలు, నగరాల్లో 4 నుంచి 6గంటలు చొప్పున అనధికార విద్యుత్ కోతలు విధించడంతో జనం అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చరవాణి వెలుతురులో ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు, ప్రసవాలు జరగడం చూస్తుంటే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసైనికులనుద్దేశించి పవన్ మాట్లాడారు.
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉండేదని, దీంతో 2014-19 మధ్య విద్యుత్ కోతల ప్రభావం పెద్దగా ఉండేది కాదన్నారు. ఒకటి రెండు సందర్భాల్లో విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు కడియం ప్రాంత రైతులు తన వద్దకు వచ్చి భారం మోయలేమని గోడు వెళ్లబోసుకున్నారని చెప్పారు. తాను ప్రభుత్వం దృష్టికి ప్రజల తరఫున ఈ విషయం తీసుకెళ్లినప్పుడు పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకున్నారని గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ పర్చేజి అగ్రిమెంట్లు రద్దు చేసిందని, యూనిట్ రూ.4.80 చొప్పున 25 ఏళ్లపాటు గ్రీన్ ఎనర్జీ కంపెనీలతో అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసిందని తెలిపారు. యూనిట్ రూ.2లకే గ్రీన్ ఎనర్జీ తీసుకొస్తామని చెప్పి.. ఇప్పుడేమో కోల్ ఎనర్జీని రూ.20లు పెట్టి కొంటున్నారని ఆరోపించారు.
36 లక్షల మంది కార్మికుల ఉపాధిపై ప్రభావం...
ఇలాంటి లోపభూయిష్ట నిర్ణయాల వల్లే విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని తెలిపారు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం, అల్పాదాయ వర్గాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన వైకాపా నాయకత్వం ఇవాళ 57 శాతం ఛార్జీలు పెంచిందని దుయ్యబట్టారు. ఫ్యాను, రెండు లైట్లు, 15 గంటలు టీవీ చూసినా 150 యూనిట్లు ఖర్చవుతుందని, మరో 50 యూనిట్లు పెద్ద మనసుతో అదనంగా ఇస్తున్నామని చెప్పారన్నారు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు భారంగా పెంచి ఇళ్లల్లో ఫ్యాన్లు వేసుకోకుండా చేశారన్నారు. విద్యార్థులు, పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పగలంతా తరగతి గదుల్లో ఉండి రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రలేక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. పరిశ్రమలకు ఇప్పటికే వారాంతంలో ఒక రోజంతా విద్యుత్కోతలు అమలు చేస్తున్నారని, తాజాగా మరో రోజు వపర్ హాలిడే ప్రకటించడంతో పరిశ్రమలు వారానికి రెండు రోజులు మూతపడనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిరంతరం పని చేసే పరిశ్రమలు ఇప్పుడు వాడుతున్న విద్యుత్లో ఇక పై 50శాతం మాత్రమే వాడాలనే నిబంధన విధించారని, దీంతో రూ.కోట్లు పెట్టుబడి పెట్టిన పారిశ్రామిక వేత్తలు విద్యుత్ కోతలతో నష్టాల పాలవుతున్నారన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం కలుగుతుందని, 36లక్షల మంది కార్మికుల ఉపాధిపై ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు.
నోటికి వచ్చినట్టు మాట్లాడి మా సహనాన్ని పరీక్షించవద్దు..
వ్యక్తిగత అజెండాతో జనసేన పార్టీని స్థాపించలేదని, ప్రజలు బాగుండాలి, వారిని పల్లకీ ఎక్కించాలనే ఉద్దేశంతోనే పార్టీని ప్రారంభించానని చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల నుంచి.. పెరిగిన విద్యుత్ ఛార్జీల వరకు ప్రజల పక్షానే పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఉద్యోగులు రోడ్డెక్కడానికి, కౌలు రైతుల ఆత్మహత్యలకు కారణం ప్రభుత్వ విధానాలేనని మండిపడ్డారు. జనసేన పార్టీ.. ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడితే తనను వ్యక్తిగతంగా రాక్షసుడు, దుర్మార్గుడు అని దూషిస్తున్నారని.. వ్యక్తిగత దూషణలకు దిగితే ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసన్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడి తమ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల రద్దు నుంచి పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించే వరకు వైకాపా అనాలోచిత విధానాలతో ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో ప్రతి ఒక్క జనసైనికుడు, వీర మహిళ ప్రజల్లోకి తీసుకెళ్లాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు