Pawan Kalyan: మార్పు కోసం అప్పుడే యుద్ధం చేస్తా: పవన్‌ కల్యాణ్‌

తనకు బాగా నచ్చిన కొటేషన్లలను ట్విటర్‌ వేదికగా పంచుకుంటుంటారు ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్. ఇప్పటికే ఎన్నో స్ఫూర్తి రగిలించే విషయాలను షేర్‌ చేసిన ఆయన తాజాగా మరో పోస్ట్‌ పెట్టారు.

Published : 03 Mar 2022 01:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనకు బాగా నచ్చిన కొటేషన్లలను ట్విటర్‌ వేదికగా పంచుకుంటుంటారు ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్. ఇప్పటికే ఎన్నో స్ఫూర్తి రగిలించే విషయాలను షేర్‌ చేసిన ఆయన తాజాగా మరో పోస్ట్‌ పెట్టారు. ‘‘ఓ మార్పు కోసం యుద్ధం చేయాల్సివస్తే తొంభైతొమ్మిది సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తా, వందోసారే యుద్ధం చేస్తా’’ అంటూ పవన్‌ కల్యాణ్ ట్వీట్‌ చేసిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో పవన్‌ ఓ పుస్తకంలో ఏదో రాస్తున్నట్టు కనిపించారు. ఈ సింబాలిక్ ఇమేజ్‌ను బట్టి ఈ మాటను తానే స్వయంగా రాసినట్టు స్పష్టమవుతోంది.

సినిమా విషయానికొస్తే.. పోలీసు అధికారిగా ఆయన నటించిన ‘భీమ్లా నాయక్‌’ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిచింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఆయన పవర్‌ఫుల్‌ నటనకు ఫిదా అవుతున్నారు. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రానా కీలక పాత్ర పోషించారు. నిత్య మేనన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. పవన్‌ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ తదితర చిత్రాలతో బిజీగా ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని