Pawan Kalyan: ఎంతమేరకు నెరవేరుస్తారో.. మరో నెల వెయిట్‌ చేస్తాం: పవన్‌ ట్వీట్‌

అన్నమయ్య డ్యామ్‌ బాధితులకు నెలరోజుల్లో ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి ఇస్తామని జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన హామీపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్పందించారు.

Updated : 21 May 2023 12:30 IST

అమరావతి: అన్నమయ్య డ్యామ్‌ బాధితులకు నెలరోజుల్లో ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి ఇస్తామని జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన హామీపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్పందించారు. ప్రభుత్వం తీసుకునే ఈ చర్యలు మోకాలడ్డేలా, కంటితుడుపులా ఉండబోవని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పవన్‌ ట్వీట్‌ చేశారు. 

ప్రభుత్వం ఇచ్చిన ఈ హామీ ఎంతమేరకు నెరవేరుతుందో తెలియాలంటే మరో నెలరోజులు ఆగాల్సిందేనని.. అప్పటి వరకు జనసేన నిరీక్షిస్తుందని పవన్‌ పేర్కొన్నారు. ‘వరద బాధితులకు నెలలో ఇళ్ల నిర్మాణం’ పేరుతో ‘ఈనాడు’లో వచ్చిన కథనాన్ని ఈ సందర్భంగా ఆయన షేర్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని