Pawan kalyan: అత్యాచార ఘటనలు ఆగకపోతే హైకోర్టు సుమోటోగా తీసుకోవాలి: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్లో వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలను నియంత్రించడంలో పాలకులు విఫలమైనందున పోలీసు ఉన్నతాధికారులే వాటిని కట్టడి చేయాలని జనసేన
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలను నియంత్రించడంలో పాలకులు విఫలమయ్యారని ఇక పోలీసు ఉన్నతాధికారులే వాటిని కట్టడి చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒకచోట మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతుండటం అత్యంత దురదృష్టకరమన్నారు. పసివాళ్లపైనా, గర్భిణులపై, మానసిక పరిణతిలేని వారిపై, విద్యార్థినులపై, యువతులపై వరుసగా అత్యాచారాలు జరగటం ఆవేదన కలిగిస్తోందని తెలిపారు. ఇది చాలా తీవ్రమైన విషయమని అత్యాచార ఘటనలు ఆగకపోతే హైకోర్టు సుమోటోగా తీసుకుని, మహిళల రక్షణకై ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
‘‘వైకాపా ప్రభుత్వం ఎలాగూ ఆడబిడ్డలను కాపాడలేదు. తమ బిడ్డలను మృగాళ్ల బారినపడకుండా తల్లిదండ్రులే కంటికిరెప్పలా కాపాడుకోవాలి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన గురించి ఎంతో బాధపడ్డాను. మహిళలకు రక్షణ కల్పించి వారు ధైర్యంగా తిరిగే పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వాన్ని మేం నిందించడం లేదు.. సూచన మాత్రమే చేస్తున్నాం. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచాలని చట్టం చెబుతున్నా.. పాలకులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. బాధ్యత గల హోదాల్లో ఉన్నవారే తల్లిదండ్రుల పెంపకాన్ని తప్పుబట్టేలా మాట్లాడటం సరికాదు. ప్రస్తుతం పాలకులను విశ్వసించేలా పరిస్థితులు లేవు. అందుకే బాధ్యత కలిగిన పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బందే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అత్యాచారాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. అసలు ఇలాంటి సంఘటనలు ఎందుకు చోటు చేసుకొంటున్నాయి, ఎలా కట్టడి చేయాలనే అంశంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేయకపోవడం దురదృష్టకరం’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్