
Pawan kalyan: అనంతబాబుకు పోలీసుల గౌరవమర్యాదలు.. ఆశ్చర్యాన్ని కలిగించాయి: పవన్ కల్యాణ్
అమరావతి: కాకినాడలో ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసుల వ్యవహార శైలి తనను విస్మయానికి గురి చేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సుబ్రహ్మణ్యంను తానే హత్య చేసినట్లు ఎమ్మెల్సీ అనంతబాబు ఒప్పుకున్న తర్వాత కూడా ఆయన పట్ల పోలీసులు కనబరిచిన గౌరవమర్యాదలు ఆశ్చర్యాన్ని కలిగించాయని తెలిపారు. సామాన్యుల పట్ల కూడా పోలీసులు ఇలాగే సహృదయత కనబరుస్తారా? అని ప్రశ్నించారు. పోలీసుల తీరుకు వారిపై ఆధిపత్యం చెలాయిస్తున్న రాజకీయ బాసులే కారణమని విమర్శించారు. నేరాలకు పాల్పడేవారికి వత్తాసు పలికేలా అధికార యంత్రాంగాన్ని పాలకులు వినియోగించుకొంటుంటే ఇక శాంతిభద్రతల గురించి ఆలోచన కూడా చేయలేమని ఆక్షేపించారు. ఈ మేరకు పవన్ ఒక ప్రకటన విడుదల చేశారు.
‘‘కోడి కత్తి కేసులో రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదన్నవారే.. ఇప్పుడు ఆ శాఖకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆ కేసులో ఏమైనా పురోగతి ఉందో.. లేదో.. కూడా తెలియదు. పులివెందులలో వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం గుండె పోటు నుంచి గొడ్డలి పోటు వరకు వెళ్లింది. ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది. అసలు దోషులెవరో తేలలేదు. ఇవే కాదు.. సామర్లకోట మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గిరీశ్బాబు అనే ఎస్సీ యువకుడిపై అధికార పార్టీ వేధింపులకు దిగింది. అందుకు పోలీసులను వాడుకోవడంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖలో ఓ మంత్రి పోలీసు అధికారి కాలర్ పట్టుకొని దుర్భాషలాడినా పోలీసులు మౌనం వహించాల్సి వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ జనసేన కార్యకర్తలపై కేసులు బనాయిస్తూ, రాజకీయంగా కక్ష సాధిస్తున్నారు. ఇవి కేవలం కొన్ని మాత్రమే.
ఈ రాష్ట్రంలో దాడి చేసినా, హత్యలు చేసినా, అత్యాచారాలు చేసినా ఏం జరగదు.. ఎవరేం చేయరనే ధైర్యం నేరస్థులకు కలిగింది. ఈ పాలకుల వైఖరే ఇందుకు కారణం. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణను వైకాపా పాలకుల నుంచి ఆశించలేం. వారికి చిత్తశుద్ధి ఉంటే హత్య చేశానని ఒప్పుకున్న ఎమ్మెల్సీపై ఈ పాటికి పార్టీ పరంగా, శాసనమండలి నుంచి భర్తరఫ్ చేసేవారు. పోలీసు అధికారులే బాధ్యత తీసుకొని రాజకీయ బాసుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా శాంతిభద్రతల పరిరక్షణలో స్వతంత్రంగా వ్యవహరించాలి. అప్పుడే ప్రజలకు పోలీసు వ్యవస్థపై, చట్టాలపై విశ్వాసం కలుగుతుంది’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: అండర్సన్ vs కోహ్లీ.. ఇదే చివరి పోరా?
-
Crime News
Andhra News: సీఎం జగన్ పీఏ పేరుతో మణిపాల్ ఆస్పత్రి ఎండీకి ఫేక్ మెసేజ్
-
Movies News
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో మీటింగ్.. అభిమాని భావోద్వేగం
-
General News
urine color: మూత్రం రంగు మారుతోందా..ఓసారి పరీక్ష చేయించుకోండి!
-
Politics News
Komatireddy: భూములిచ్చిన రైతులకు బేడీలా? కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: కోమటిరెడ్డి
-
Sports News
T20 World Cup: టీమ్ఇండియాకు షాకేనా..? టీ20 ప్రపంచకప్ జట్టులో షమి లేనట్టేనా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో మీటింగ్.. అభిమాని భావోద్వేగం
- Eknath Shindhe: నాడు ఆటో నడిపారు.. ఇకపై మహారాష్ట్రను నడిపిస్తారు..
- YSRCP: గన్నవరం వైకాపాలో 3 ముక్కలాట.. అభ్యర్థి ఎవరో తేల్చేసిన కొడాలి నాని
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేత!
- Credit card rules: క్రెడిట్ కార్డుదారులూ అలర్ట్!.. జులై 1 నుంచి కొత్త రూల్స్
- Maharashtra: ‘నాన్నే చెప్పేవారు.. మనకు చెందనిది ఎప్పటికీ మనతో ఉండదని..’: ఆదిత్య ఠాక్రే
- BJP: అంబర్పేట్లో భాజపా దళిత నాయకుడి ఇంట్లో భోజనం చేసిన యూపీ డిప్యూటీ సీఎం
- Raj Thackeray: అన్న రాజీనామా.. రాజ్ ఠాక్రే కీలక ట్వీట్