Pawan Kalyan: మున్ముందు దేశమంతా జనసేన భావజాలమే: పవన్ కల్యాణ్
కుల సమీకరణాల గురించి ఆలోచిస్తే ఎప్పటికీ అభివృద్ధి సాధ్యం కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వారాహి యాత్రలో భాగంగా మచిలీపట్నంలో పవన్ పర్యటించారు.
మచిలీపట్నం: కుల సమీకరణాల గురించి ఆలోచిస్తే ఎప్పటికీ అభివృద్ధి సాధ్యం కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వారాహి యాత్రలో భాగంగా మచిలీపట్నంలో పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. మచిలీపట్నానికి చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం ఉందని.. తనను ఎంతగానో ప్రభావితం చేసిన నేల ఇదని చెప్పారు.
‘‘పింగళి వెంకయ్య, రఘుపతి వెంకటరత్నం నాయుడు పుట్టిన నేల ఇది. దుబాయ్ వంటి చోట్ల మూడింట రెండొంతులు భారతీయులే ఉంటారు. కులాల ఐక్యత గురించి నేను పదే పదే చెబుతాను. ఏ ఒక్క కులం వల్లో అధికారం రాదని గుర్తించాలి. నేను అన్నింటినీ సమదృష్టితో చూసే వ్యక్తిని. నేను కులాలను వెదుక్కొని స్నేహాలు చేయను. వైకాపా కీలక పదవులన్నీ ఒక వర్గంతో నింపేస్తే అభివృద్ధి ఎలా సాధ్యం? కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు.. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి. ఒక కులానికి మరో కులం పట్ల ఎందుకు ద్వేషం ఉండాలి?
సామాజిక వెనుకబాటును ఎలా రూపుమాపాలా అని అందరూ ఆలోచించాలి. నాలుగు ఎన్నికల్లో కష్టపడితే బీఎస్పీ అధికారంలోకి వచ్చింది. లేచిందే లేడికి పరుగు అన్నట్లు.. పార్టీ పెట్టగానే అధికారం రాదు. పార్టీ పెట్టగానే అధికారం అందుకోవడం ఒక్క ఎన్టీఆర్కే సాధ్యమైంది. జనసేన విశాలభావం ఉన్న పార్టీ.. ఇది ప్రాంతీయ పార్టీ కాదు. మున్ముందు జనసేన భావజాలమే దేశమంతా వ్యాపిస్తుంది. రాజధానికి 30 వేల ఎకరాలు అన్నప్పుడు ఆరోజు విభేదించా. రాజధాని అనేది రాత్రికి రాత్రే అభివృద్ధి కాదు. జగన్ను చిన్నప్పటి నుంచీ చూస్తున్నా. రాష్ట్రానికి జగన్ సరైన వ్యక్తి కాదని ఆనాడే అనుకున్నా. లోతైన దృష్టితోనే రాజకీయాలను చూడాలి’’ అని పవన్ అన్నారు.
ముందు గెలవాలి.. అప్పుడు మాట్లాడుదాం..
‘‘మనలో మనం గొడవలు పెట్టుకోకుండా ఉంటే.. మనం గెలుస్తాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాటల ద్వారానే సమస్యలకు పరిష్కారం వెతుకుదాం. తెదేపా-జనసేన కలయిక ద్వారా భవిష్యత్తులో నేను సీఎం అవుతానా.. లేదా.. అనేది మన మెజారిటీపై ఆధారపడి ఉంటుంది. నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న పార్టీని కూడా జనసేన నాయకులు, కార్యకర్తలు తక్కువ అంచనా వేయొద్దు. తెదేపా నేతలు ఇవాళ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారు కదా అని వారిని తక్కువ చేసి మాట్లాడొద్దు. ఎవరి ఓటు షేరు వారికి ఉంటుంది. చంద్రబాబు.. జగన్తో నాకు ఎలాంటి వ్యక్తిగత గొడవలు లేవు. తెదేపా - జనసేన గెలుపు మీ చేతుల్లోనే ఉంది. అధికారం సాధించే దశలో జనసేన బలమైన స్థానంలో ఉండాలనేది నా ఆకాంక్ష. అది మీ చేతుల్లోనే ఉంది. ముందు గెలవాలి. అప్పుడు మాట్లాడుదాం. ఎవరు రాజు.. ఎవరు మంత్రి అనేది..’’ అని పవన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Atchannaidu: వచ్చేది తెదేపా ప్రభుత్వమే.. దోచుకున్న సొమ్మంతా కక్కిస్తాం: అచ్చెన్నాయుడు
దశలవారీగా మద్యం నిషేధిస్తామని చెప్పిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఇవాళ ఏం చేస్తున్నారని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) ప్రశ్నించారు. -
Nara Lokesh: ఆక్వా రైతులను జగన్ ప్రభుత్వం కోలుకోలేని దెబ్బతీసింది: లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. -
వర్షంలో పవార్ ప్రసంగం
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పార్టీ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా వర్షం కురిసింది. అయితే.. దానిని లెక్కచేయకుండా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో రాహుల్కు యూపీ కోర్టు సమన్లు
కేంద్ర మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సోమవారం సమన్లు జారీ అయ్యాయి. -
Nara Lokesh: వైకాపా దోచిన డబ్బును ప్రజలకు ఇప్పిస్తాం
‘నేను తప్పుచేస్తే.. చంద్రబాబే జైలుకు పంపుతారు. ఏ తప్పూచేయలేదు కనుకే.. ధైర్యంగా రాజోలు సభలో ‘సైకో జగన్’ అని పిలవగలుగుతున్నా’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
యువగళం శబ్దానికి.. పాలకపక్షం పునాదులు కదులుతాయ్
తెదేపా యువనేత నారా లోకేశ్ రెండోవిడత యువగళం పాదయాత్ర శబ్దానికి పాలకపక్షం పునాదులు కదలడం ఖాయమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు స్పష్టంచేశారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. -
యువగళం.. ప్రభం‘జనం’
వేల మంది అభిమానులు.. దారిపొడవునా నీరాజనాల నడుమ తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సోమవారం పునఃప్రారంభమైంది. -
సమస్యల్ని పరిష్కరించకపోతే ప్రభుత్వాన్ని కూల్చేస్తాం
సీఎం జగన్కు ఫిబ్రవరి 28 వరకు గడువు ఇస్తున్నామని, అప్పటికీ తమ సమస్యల్ని పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవంతో వైకాపా సర్కారును కూల్చేస్తామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మునెయ్య హెచ్చరించారు. -
వైకాపా సామాజిక యాత్రతో ఇక్కట్లు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన వైకాపా సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభ స్థానికులను ఇబ్బందులకు గురి చేసింది. -
మార్పు రాకపోతే బిడ్డల భవిష్యత్తు అతలాకుతలమే
‘ప్రజల్లో ఇప్పటికైనా మార్పు రాకపోతే వారి బిడ్డల భవిష్యత్తు అతలాకుతలమే’ అనే సందేశాన్నిచ్చేలా ఉన్న ఓ లఘుచిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ‘అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. -
తాడిపత్రిలో బస్సు యాత్ర వెలవెల
అనంతపురం జిల్లా తాడిపత్రిలో సోమవారం జరిగిన వైకాపా సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం నుంచి స్పందన కరవైంది. సభలో కనీసం కుర్చీలు వేయకపోవడంతో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఇబ్బంది పడ్డారు. -
మంత్రాలయంలో వైకాపాకు ఎదురుదెబ్బ
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. కర్నూలు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (కేడీసీసీబి) మాజీ అధ్యక్షుడు రామిరెడ్డి తనయులు వైకాపాకు రాజీనామా చేశారు. -
నంద్యాల నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జిగా ఫరూక్
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జిగా మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ నియమితులయ్యారు. -
అవినీతికి సహకరిస్తారనే డిప్యుటేషన్పై తీసుకొస్తున్నారా?
రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులు మీ అవినీతికి సహకరించడం లేదనే కేంద్ర సర్వీసుల నుంచి నాన్ క్యాడర్ ఐఏఎస్లను డిప్యుటేషన్పై తీసుకొస్తున్నారా అని సీఎం జగన్ను తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు ప్రశ్నించారు. -
వైకాపాకు డిపాజిట్లు వస్తే మనం ఓడిపోయినట్లే..: అచ్చెన్నాయుడు
‘తెదేపా-జనసేనలు కలిశాక గోదావరి జిల్లాల్లో వైకాపాకు డిపాజిట్లు వస్తే మనం ఓడిపోయినట్లే లెక్క..’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. యువగళం పాదయాత్ర సభలో ప్రసంగించారు. -
సామాజిక సాధికార యాత్రకు జనాల తరలింపు
ఏలూరు జిల్లా కైకలూరులో మంగళవారం జరగనున్న వైకాపా సాధికార యాత్రకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణకు అధికారులు, నాయకులు కృషి చేస్తున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Uttarakhand Tunnel: డ్రిల్లింగ్ పూర్తి.. ఏ క్షణమైనా కూలీలు బయటకు..
-
Supreme court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ
-
Automobile retail sales: పండగ సీజన్లో రికార్డు స్థాయికి వాహన విక్రయాలు.. 19% వృద్ధి
-
ఐపీఎల్ వాళ్లకు చేదు.. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు అచ్చిరాని ఇండియన్ లీగ్
-
North Korea: కిమ్ శాటిలైట్.. శ్వేతసౌధం, పెంటాగన్ ఫొటోలు తీసిందట..!
-
Atchannaidu: వచ్చేది తెదేపా ప్రభుత్వమే.. దోచుకున్న సొమ్మంతా కక్కిస్తాం: అచ్చెన్నాయుడు