Pawan Kalyan: వైకాపా మరోసారి అధికారంలోకి రాదు: పవన్ కల్యాణ్
వైకాపా మరోసారి అధికారంలోకి రాదని, రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన ఆ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మళ్లీ రాని ప్రభుత్వం
అమరావతి: వైకాపా మరోసారి అధికారంలోకి రాదని, రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన ఆ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మళ్లీ రాని ప్రభుత్వం కోసం అధికారులు తాపత్రయపడొద్దని పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో.. అధికార పార్టీ తీరుపై నిప్పులు చెరిగిన పవన్.. జనసేన భవిష్యత్ కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యహాలపై పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఆ విషయం వైకాపా నేతలు అర్థం చేసుకోవాలి..
‘‘ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపై చాలా ఆలోచించే మాట్లాడా. వైకాపా ప్రభుత్వ అరాచకం, దోపిడీ వల్లే ఆ మాట అన్నా. రాష్ట్రాన్ని శ్రీలంకలా మారుస్తున్నందువల్లే అలా మాట్లాడా. వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని రాజకీయ వ్యూహం కోసం అనలేదు. ప్రజలను పల్లకీ ఎక్కించేందుకే జనసేన సిద్ధంగా ఉంది. ఎవరి పల్లకీ మోసేందుకు మేం ఇక్కడ లేం. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వం అంటే ఎందుకంత ఉలుకు?. జనసేన అంటే వైకాపా నేతలకు ఎందుకు భయం? మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి ప్రత్యేక రేట్లకు ఎలా అమ్ముతారు? 2018లో కరెంటు ఛార్జీల పెంపును జగన్ వ్యతిరేకించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక మీరెందుకు కరెంటు ఛార్జీలు పెంచారు? ఇప్పుడున్నది కొత్త తరమని వైకాపా నేతలు అర్థం చేసుకోవాలి. చెత్తపన్ను పెంచారు. వేలాది మంది కౌలు రైతులు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. విదేశాలకు వెళ్లే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్ సదుపాయం రద్దు చేశారు. 100 మంది దగ్గర పన్నులు వసూలు చేసి మీరు అనుకున్న 35 నుంచి 40 మందికో ఇస్తే మిగతా 60.. 65 మంది ఏం కావాలి? కర్నూలు జిల్లాలోనే 353 మంది కౌలు రైతులు చనిపోయారు. అనంతపురంలో 170, ఉభయ గోదావరి జిల్లాల్లో 81 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అన్నం పెట్టే రైతుల్లో కులం చూడకూడదు. రైతులకు కులం లేదు.. వారికి అండగా నిలవాలి. రాష్ట్రంలో ఇన్ని వేల మంది రైతులు ఉన్నారు.. సాయం ఎలా చేస్తారని నన్ను అడిగారు. మనసు ఉండి కదిలించగలిగితే సాయం చేయెచ్చు. మొన్న సినిమా ద్వారా వచ్చిన డబ్బులో రూ.5 కోట్లు తీసుకొచ్చా. మనవంతు ఎంతో కొంత సాయం చేయాలి. గొప్ప గొప్ప చదువులు చదువుకున్న జాతీయ స్థాయి నాయకులు సొంత ఆస్తులు ఇచ్చేశారు. వైకాపా నేతల ధ్యాసంతా డబ్బు తీసుకోవడంపైనే ఉంది.. ఇవ్వడంలో లేదు. అన్నం తినే ప్రతి ఒక్కరూ రైతు కష్టం గురించి ఆలోచించాలి. ఈ నెల 12న అనంతపురం నుంచి కార్యక్రమం ప్రారంభిస్తాం. కౌలు రైతులకు సాయం చేసే కార్యక్రమానికి ‘జనసేన రైతు భరోసా యాత్ర’గా నామకరణం చేశాం.
ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి సారిస్తా..
రాష్ట్ర విభజన సమయంలో ఇంత మంది ఎంపీలు ఉండి విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు ఇవ్వాలని అడగలేదు. దాని ఫలితమే ఇవాళ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చింది. ప్రైవేటికరణను జనసేన వ్యతిరేకిస్తుంది.. కార్మికుల తరఫున అండగా నిలబడతాం. క్రైమ్ రేట్ పెరుగుతుందంటే పాలనా వ్యవస్థ సరిగాలేదని అర్థం. పొత్తులో ఉన్నప్పుడు 70శాతం ఏకాభిప్రాయం ఉంటే చాలు. ఏకీభవించని అంశాలు చాలా ఉంటాయి. పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్రలో బలమైన ప్రాంతీయ కార్యాలయం ఉండాలని కోరుకుంటున్నా. ఇంత బలం ఉండి రాజాం పర్యటనకు వెళితే.. ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. కానీ, వారిని ఉపయోగించుకోలేక పోయాం.. ముందుకు తీసుకెళ్లే నాయకత్వం ఇక్కడ లేదు. ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి సారిస్తా’’ అని పవన్ పేర్కొన్నారు.
వైకాపా వ్యూహాలను దీటుగా ఎదుర్కొందాం
‘‘యువతకు ఉద్యోగాలు లేవు. కాలం విలువ వైకాపా నేతలకు తెలియట్లేదు. ఒక నాయకుడు మాట చెబితే ప్రజలు నమ్ముతారు. వైకాపా చెప్పిన మాటలు నమ్మి యువత ఓట్లు వేశారు. కానీ, నాయకులు మోసం చేశారు. ఏ ఉపాధి లేని యువత తప్పుడు మార్గం వెతుక్కుంటారు. రాష్ట్రంలో గంజాయి సాగు ఎందుకు పెరిగిందో ఆలోచించాలి. నిరుద్యోగం వల్లే రాష్ట్రంలో గంజాయి సాగు పెరిగింది. పెట్టుబడులు రావాలంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉండాలి. ఏ రాష్ట్రానికి అయినా రాజధాని ముఖ్యం. సంపద సృష్టికి రాజధాని అవసరం. అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉందాం. విశాఖను విశ్వనగరంగా చేయాలి. తిరుపతిని స్మార్ట్సిటీగా, కర్నూలును మరింత అభివృద్ధి చేయాలి. రాష్ట్రంలో ఇసుక దోపిడీ విధానం చూసి బాధేసింది. మొత్తం ఇసుకంతా ఒకటి.. రెండు కంపెనీలకు కట్టబెట్టారు. తెల్లకార్డు దారులకు ఉచితంగా ఇసుక ఇవ్వాలి. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే యువతకు ఏడాదికి లక్ష మందికి రూ.10లక్షల చొప్పున వారి ఖాతాల్లో వేయాలి. రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధితో పాటు, కౌలు రైతులకు అండగా నిలవాలి. మళ్లీ తాము అధికారంలోకి రాకపోతే వచ్చే ప్రభుత్వాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలా? అని వైకాపా నేతలు చూస్తున్నారు. అందుకే సాధ్యమైనంత ఎక్కువ అప్పులు చేస్తున్నారు. వైకాపా వ్యూహాలను దీటుగా ఎదుర్కొంటాం. మన దగ్గర స్పష్టమైన ప్రణాళిక ఉంది’’ అని పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళేశ్వరం, కేసీఆర్పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
భారాసకు భారీ షాక్
లోక్సభ ఎన్నికల వేళ భారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. -
సంక్షిప్త వార్తలు
ఎన్డీయే తీరుపై భాగస్వామ్య పక్ష నేత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అఠావలె అసంతృప్తి వ్యక్తం చేశారు. -
6న జైపుర్లో కాంగ్రెస్ మేనిఫెస్టో
లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను వచ్చే నెల 6వ తేదీన రాజస్థాన్ రాజధాని జైపుర్లో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేత సుఖ్జీందర్ సింగ్ రణధావా తెలిపారు. -
జగన్పై ఒంటరిగానే నా పోరాటం
-
ఎమ్మెల్యే కాటసాని సోదరుడు చంద్రశేఖరరెడ్డితో తెదేపా మంతనాలు
నంద్యాల జిల్లా బనగానపల్లిలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డితో గురువారం రాత్రి తెదేపా నేతలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్రెడ్డి మంతనాలు సాగించారు. -
‘సంగం’పై ఆర్వో ఎలా స్పందిస్తారు: ధూళిపాళ్ల
కంపెనీ చట్టంలో ఉన్న సంగం డెయిరీపై వైకాపా నాయకుడు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారని గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వోను మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రశ్నించారు. -
గుంటూరు మిర్చియార్డులో వైకాపా అభ్యర్థుల ప్రచారం
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వైకాపా గుంటూరు లోక్సభ అభ్యర్థి, పలు శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈ నెల 22న గుంటూరు మిర్చియార్డులో ప్రచారం నిర్వహించారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనాకు యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. -
వైకాపా సభ్యత్వానికి తిరుపతి కార్పొరేటర్ల రాజీనామా
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తిరుపతిలో వైకాపా అసంతృప్త నేతలు బయటపడుతున్నారు. -
వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన!
రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించే అవకాశాలున్నాయి. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
బాలీవుడ్, హాలీవుడ్ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
శివసేన (శిందే)లో చేరిన నటుడు గోవిందా
సార్వత్రిక ఎన్నికల ముందు బాలీవుడ్ నటుడు గోవిందా (60) మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. గురువారం ఆయన శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమిటీ
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు రాష్ట్ర పార్టీ ‘తెలంగాణ ప్రజల ముంగిట్లోకి జాతీయ మ్యానిఫెస్టో’ కమిటీని ఏర్పాటు చేసింది. -
రేవంత్ అధ్యక్షతన పీఈసీ సమావేశం నేడు
కాంగ్రెస్ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(పీఈసీ) సమావేశం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జరగనుంది. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
చెంగిచర్ల వెళ్లిన ఎంపీ బండి సంజయ్పై కేసు
ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు బుధవారం చెంగిచర్ల వెళ్లిన ఎంపీ బండి సంజయ్పై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణ జరిపించాలి: లక్ష్మణ్
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు