Pawan kalyan: విశాఖలో ప్రధాని మోదీతో భేటీ కానున్న పవన్ కల్యాణ్
ఏపీ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రధాని మోదీతో భేటీ కానుండడం రాజకీయవర్గాల్లో చర్చనీయాశంగా మారింది.
అమరావతి: ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రధాని మోదీతో భేటీ కానుండడం రాజకీయవర్గాల్లో చర్చనీయాశంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మోదీతో పవన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు పవన్ కల్యాణ్తో మోదీ సమావేశమవుతారని భాజపా ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో పరిస్థితులు, తాజా రాజకీయాలపై చర్చించే అవకాశముందని సమాచారం. విశాఖలో భాజపా నిర్వహించే ర్యాలీలో పవన్ పాల్గొంటారా? లేదా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. రేపు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పవన్ విశాఖ చేరుకుంటారు. రెండ్రోజుల పాటు ఆయన విశాఖలో పర్యటిస్తారని జనసేన వర్గాలు తెలిపాయి. ఇటీవల విశాఖ పర్యటన సందర్భంగా పవన్ను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్