అస్తవ్యస్తంగా ఏపీ ఆర్థిక వ్యవహారాలు: కేశవ్‌

ఏపీ ఆర్థిక శాఖకు కేంద్రం రాసిన మరో లేఖను ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల

Updated : 10 Jul 2021 16:25 IST

అమరావతి: ఏపీ ఆర్థిక శాఖకు కేంద్రం రాసిన మరో లేఖను ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ విడుదల చేశారు. పరిధికి మించి రూ.17,923.94 కోట్ల మేర అప్పులు చేశారంటూ రాష్ట్ర ఆర్థిక శాఖకు జూన్‌ 30న కేంద్రం రాసిన లేఖను ఆయన బయటపెట్టారు. ఈ లేఖలో రుణాలు, కేంద్ర ఆర్థికశాఖ అభ్యంతరాలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని పయ్యావుల డిమాండ్‌ చేశారు. కేంద్ర ఆర్థికశాఖ వివరణ కోరడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిందేనన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, కేంద్ర ఆర్థిక రాసిన లేఖతో స్పష్టమైందని చెప్పారు. రాష్ట్రం చేసే ఆర్థిక తప్పిదాలపై ముఖ్యమంత్రి కేంద్రానికి సమాధానం చెప్పాలని పయ్యావుల కేశవ్‌ డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని