Payyavula Keshav: చంద్రబాబు దిల్లీ వెళితే తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రకంపనలు: పయ్యావుల

తెదేపా అధినేత చంద్రబాబు దిల్లీ వెళితే తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రకంపలను వస్తున్నాయని ఏపీ పీఏసీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు. మూడేళ్ల తర్వాత దిల్లీ వెళ్లిన చంద్రబాబుతో...

Updated : 10 Aug 2022 16:29 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు దిల్లీ వెళితే తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రకంపలను వస్తున్నాయని ఏపీ పీఏసీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు. మూడేళ్ల తర్వాత దిల్లీ వెళ్లిన చంద్రబాబుతో మాట్లాడేందుకు అక్కడ చాలా మంది నేతలు ఉత్సాహం చూపించారని చెప్పారు. అమరావతిలో పయ్యావుల మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌ కూడా దిల్లీ వెళ్లారని.. ప్రత్యేకహోదా, పోలవరం నిధులు తదితర అంశాలపై ప్రధానితో ఏమైనా చర్చించారా? అని ఆయన ప్రశ్నించారు. అక్కడ ఏం జరిగిందనేది ప్రజలకు సీఎం చెప్పాల్సిన అవసరముందన్నారు. 

నా గన్‌మెన్లనే ఎందుకు మారుస్తున్నారు?

గన్‌మెన్లను తగ్గించే అంశంపై పయ్యావుల మాట్లాడుతూ భద్రత విషయంలో వైకాపా నేతలకు లేని షరతులు తనకే ఎందుకని ప్రశ్నించారు. అంత అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. తనను ఏదో ఒక కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారముందని ఆయన చెప్పారు. తన నియోజకవర్గం ఉరవకొండ ప్రాంతంలో ఇటీవల మాజీ నక్సలైట్ల కదలికలు పెరిగాయన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తన గన్‌మెన్లనే ఎందుకు మారుస్తున్నారని పయ్యావుల కేశవ్‌ నిలదీశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని