మమత నుంచి ‘మమత’ కరవు: మోదీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు ఊపందుకున్నాయి. తాజాగా హల్దియాలో నిర్వహించిన.....
హల్దియా (పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు ఊపందుకున్నాయి. తాజాగా హల్దియాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మమతా బెనర్జీ నుంచి ‘మమత’ (ఆప్యాయత)ను ప్రజలు ఆశిస్తే ఆమె నుంచి నిర్మమత (క్రూరత్వం) లభించిందంటూ ప్రాసలు ఉపయోగిస్తూ విమర్శలు ఎక్కుపెట్టి పార్టీ శ్రేణులను ఉత్సాహ పరిచారు. అంతకుముందు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
తృణమూల్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ప్రధాని మోదీ విమర్శించారు. వామపక్ష ప్రభుత్వానికి తృణమూల్ ప్రభుత్వం పునర్జన్మలాంటిదే తప్ప ఇంకొకటి కాదన్నారు. ‘భారత్ మాతాకీ జై’ అని నినదిస్తే నచ్చని మమత.. దేశాన్ని అప్రతిష్ఠ పాల్జేసే కుట్రలపై నోరు మెదపరని అన్నారు. తృణమూల్ హయాంలో నేరాలు వ్యవస్థీకృతమైపోయాయని దుయ్యబట్టారు. అందుకే ప్రజలు రాబోయే ఎన్నికల్లో భాజపాకు పట్టం కట్టాలని భావిస్తున్నారని మోదీ అన్నారు. తాము అధికారంలోకి వస్తే కేంద్ర పథకాలన్నీ రాష్ట్రంలో అమలయ్యేలా తొలి కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకుంటామని మోదీ చెప్పారు.
ఇవీ చదవండి..
సీఎం మార్పు ఊహాగానాలపై కేసీఆర్ స్పష్టత
దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రలు: మోదీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు