Himachal polls2022: ఆ హామీల్ని ప్రజలు సీరియస్గా తీసుకోరు.. రాహుల్ సారీ చెప్పాలి: నడ్డా
ప్రజలకు భాజపా ఉచితాలు ఇవ్వదని.. వారికి సాధికారత కల్పించే దిశగా పనిచేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.
దిల్లీ: ప్రజలకు భాజపా ఉచితాలు ఇవ్వదని.. వారికి సాధికారత కల్పించే దిశగా పనిచేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రాల వారీగా యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అంశాన్ని చేపడతామని.. రాష్ట్ర స్థాయిలోనే దీన్ని అమలు చేస్తామని తెలిపారు. హిమాచల్ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ చెబుతోన్న పాత పింఛను విధానం (ఓపీఎస్) పునరుద్ధరణ అంశాన్ని ఉద్యోగులు సీరియస్గా తీసుకోరన్నారు. ఈ విషయాన్ని పరిశీలించి ఓపీఎస్పై తమ పార్టీయే ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మంగళవారం ఆయన ఓ వార్తా సంస్థతో ఇంటర్వ్యూలో మాట్లాడారు. భాజపా ఉచితాల్ని విశ్వసించదు.. ప్రజలను ఆకర్షించడంపై కాకుండా వారికి సాధికారత కల్పించే దిశగానే పనిచేస్తుందన్నారు. ఆర్థికవనరుల్ని పరిగణనలోకి తీసుకోకుండా కాంగ్రెస్ ఇస్తున్న హామీలను ప్రజలు సీరియస్గా తీసుకోరని నడ్డా అభిప్రాయపడ్డారు.
రాష్ట్రాల స్థాయిలో యూసీసీ అమలు
‘‘యూనిఫాం సివిల్ కోడ్ అంశం చాలా కీలకమైనది.. అధికారంలో ఉన్న పార్టీ దేశాన్ని చాలా సున్నితంగా నడాపాల్సి ఉంటుంది. అందుకే యూసీసీ అంశాన్ని రాష్ట్రాల వారీగా తీసుకొని హిమాచల్ప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాం. రాష్ట్రస్థాయిలో అమలు చేస్తాం. హిమాచల్ప్రదేశ్, గుజరాత్లలో భాజపా సులువుగా విజయం సాధిస్తుంది. ప్రతీ ఎన్నికనూ మేం చాలా సీరియస్గా తీసుకుంటాం. అదనపు ఒత్తిడిని తీసుకోం. ఏ రాష్ట్రంలోనూ మా పనితీరుపై రాజీ ఉండదు. ప్రతి ఎన్నిక ముఖ్యమైనదే. హిమాచల్ప్రదేశ్లో ప్రభుత్వ అనుకూలత కనబడుతోంది. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వానికి ప్రతికూల వాతావరణం కనబడటంలేదు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జైరాం ఠాకూర్లు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఆమోదిస్తున్నారు’’ అన్నారు.
హిమాచల్లో కొత్త ట్రెండ్
‘‘దేశంలో భాజపా కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. హిమాచల్ ప్రదేశ్లో ఒకసారి ఒక పార్టీకి, మరోసారి ఇంకో పార్టీకి అధికారం ఇచ్చే సంప్రదాయానికి అక్కడి ప్రజలు స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైంది. ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవాలలో వరుసగా రెండోసారి భాజపా అధికారంలోకి వచ్చినట్టుగానే హిమాచల్ప్రదేశ్లోనూ జరుగుతుంది’’ అని నడ్డా ఆశాభావం వ్యక్తంచేశారు.
జాతికి రాహుల్ క్షమాపణ చెప్పాలి..
‘‘కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశాన్ని ఏకం చేస్తున్నారా? విచ్ఛిన్నం చేస్తున్నారా? దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్న, ఉగ్రవాదుల పట్ల సానుభూతితో వ్యవహరిస్తున్న వారికి అనుకూలంగా ఆయన ఉంటున్నట్టు కనబడుతోంది. అందుకు జాతికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ చేస్తోన్న తప్పిదాలకు అనేకసార్లు పశ్చాత్తాపపడాలి. నేను పదవి కోసం ఏనాడూ ఆశపడలేదు. నా సొంత రాష్ట్రమైన హిమాచల్ప్రదేశ్లో రాజకీయ ఆశలు పెట్టుకోలేదు. నాకు అప్పగించిన పనిపైనే కేంద్రీకరిస్తూ పనిచేశాను తప్ప ఎలాంటి పదవుల కోసం ఆరాటపడలేదు. నేనెప్పుడూ ఏమీ అడగలేదని మాత్రం చెప్పగలను. నాకు ఆశలు లేవు. పార్టీ వల్లే నేను ఇంత కీలక స్థానానికి చేరా’’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
కాంగ్రెస్ కంచుకోట కోలార్లో అసమ్మతి భగ్గుమంటోంది. ఈ స్థానానికి వారసత్వంగా సీటు కేటాయిస్తే రాజీనామాలు చేస్తామని పార్టీ సీనియర్ నేతల నుంచి ధిక్కారస్వరం వినిపిస్తోంది. -
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. -
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్పైనే ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
భూమా అఖిలప్రియను అడ్డుకున్న వైకాపా నేతలు.. యర్రగుంట్లలో ఉద్రిక్తత
మాజీ మంత్రి, ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియను వైకాపా నేతలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. -
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. -
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. -
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!
Congress: కంగనా రనౌత్పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ తాజా లోక్సభ అభ్యర్థుల జాబితా నుంచి తప్పించింది. -
ఇంటికి కిలో బంగారం పంచినా జగన్కు ఓటమే
అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్ను తాడేపల్లి ప్యాలెస్లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
నగదు, మద్యం దొరికినా అధికారులు స్పందించరేం?
తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్లు దొరికినా.. జిల్లా కలెక్టర్, ఆర్వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం
ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. -
రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
ముందు చెల్లికి సమాధానం చెప్పాలి
బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్... బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిని వెంట బెట్టుకుని బయటకొచ్చారని, అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోక పోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకూ అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. -
రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డికి అసమ్మతి సెగ
‘పరిటాల కుటుంబంతో పోరాటం అన్నది నా ఒక్కడితో సాధ్యం కాదు.. ఇప్పటికే ఒకసారి ఓడిపోయి ఇల్లు అమ్ముకొని రోడ్డున పడ్డానని ప్రకాశ్రెడ్డి అంటే ఆయనను ఇంట్లో కూర్చోబెట్టాం..మమ్మల్ని మాత్రం ఆయన రోడ్డున పడేశారు. -
మట్టి మింగేస్తున్నారు.. మనుషుల్ని చంపేస్తున్నారు
‘వైకాపా పాలనలో అక్రమ తవ్వకాలతో మట్టిని మింగేస్తున్నారు.. ప్రశ్నించిన మనుషులనూ చంపేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. -
పవన్కల్యాణ్తో నాయకుల సమావేశం
ఒంగోలు ఎంపీ, తెదేపా నేత మాగుంట శ్రీనివాసులురెడ్డి.. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్తో భేటీ అయ్యారు. -
తెలిసే.. వదిలేశారా?
అధికార వైకాపా తాయిలాల పంపిణీలో దూసుకుపోతుంటే తిరుపతి జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్టీల ఉమ్మడి భేటీలు
ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 4న లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో, 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించాలని తెదేపా, జనసేన, భాజపా నిర్ణయించాయి. -
కేసుల్లోనూ నంబర్ వన్ ముఖ్యమంత్రి జగనే
దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోకెల్లా ధనవంతుడైన జగన్.. కేసుల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నేత దీపక్రెడ్డి ఎద్దేవా చేశారు. -
అనంతపురం జిల్లాలో ఘోరం..
అనంతపురం జిల్లా శింగనమల మండల వైకాపా మాజీ కన్వీనర్, అసమ్మతి నాయకుడు పట్నం నగేశ్ మామిడి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. -
భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే
రాష్ట్రంలో పోటీ చేయనున్న పది అసెంబ్లీ స్థానాలకు భాజపా అధినాయకత్వం బుధవారం అభ్యర్థుల్ని ప్రకటించింది. వీరిలో సుజనాచౌదరికి కేంద్ర మంత్రిగా, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డిలకు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించిన అనుభవం ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్