వారితో ప్రజలు విసిగిపోయారు: మోదీ 

కేరళలో అధికార ఎల్డీఎఫ్‌, ప్రతిపక్ష యూడీఎఫ్‌ కూటములపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ రెండు కూటములతో......

Updated : 03 Apr 2021 12:27 IST

కొన్ని: కేరళలో అధికార ఎల్డీఎఫ్‌, ప్రతిపక్ష యూడీఎఫ్‌ కూటములపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ రెండు కూటములతో ప్రజలు విసిగిపోయారని, భాజపా అభివృద్ధి అజెండాను కోరుకుంటున్నారన్నారు. శుక్రవారం ఆయన పథనంతిట్ట జిల్లాలోని కొన్నిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శబరిమల అయ్యప్ప పుణ్యక్షేత్రం సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో ఆయన తన ప్రసంగానికి ముందు మూడు పర్యాయాలు స్వామియే శరణం అయ్యప్ప అని నినాదాలు చేశారు. 

అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌లను ప్రజలు ఇక చాలు.. చాలు అంటున్నారన్నారు. భాజపా, ఎన్డీయే అభివృద్ధి అజెండాను కేరళ ప్రజలు చూస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, విధానాలతో సంబంధాలు కలిగి ఉన్నారని ప్రధాని తెలిపారు. ప్రొఫెషనల్‌ కమ్యూనిటీ భాజపాను హర్షిస్తోందని, మెట్రోమ్యాన్‌ లాంటి విద్యావంతులను రాజకీయాల్లోకి తీసుకొచ్చే పార్టీ తమదేనన్నారు. క్రియాశీలత కలిగిన మెట్రోమ్యాన్‌ లాంటి ప్రొఫెషనల్స్‌ కేరళ రాజకీయాల్లో గేమ్‌ ఛేంజర్‌లు అవుతారన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని