Mayawati: రాజకీయ పార్టీల హామీలకు లొంగిపోవద్దు.. ఓటర్లకు మాయావతి విజ్ఞప్తి
రాజకీయ పార్టీల హామీలకు లొంగిపోవద్దని బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. భాజపా తప్పుడు విధానాలకు యూపీ ప్రజలే ....
లఖ్నవూ: రాజకీయ పార్టీల హామీలకు లొంగిపోవద్దని బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. భాజపా తప్పుడు విధానాలకు యూపీ ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారన్నారు. ఎన్నికలకు ముందు పెద్ద పెద్ద హామీలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ కొన్ని రాజకీయ పార్టీలు డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. భాజపా తప్పుడు విధానాలకు ప్రజలు బాధపడుతున్నారని, ఈ ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ఓటర్లంతా ఆతృతతో ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. కేవలం బీఎస్పీ మాత్రమే హింస, అల్లర్లు లేని పాలనను అందించగలదని, ఉపాధి కల్పిస్తూ అభివృద్ధికి భరోసా కల్పించగలదని ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు.
రాష్ట్రంలో కోట్లాది మంది బహుజనులు, అగ్రవర్ణ పేదలు భాజపా, ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల ప్రజావ్యతిరేక వైఖరితో నష్టపోయారని మాయవతి విమర్శించారు. దీన్ని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. యూపీలో భాజపా కొనసాగిస్తున్న తప్పుడు విధానాలు, కుల, మత కార్యకలాపాలతో కోట్లాది మంది ప్రజలు పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వలసలతో బాధపడుతున్నారంటూ ధ్వజమెత్తారు. తమకు మంచి రోజులు తీసుకురావడంలో బీఎస్పీ కచ్చితంగా ఉపయోగపడుతుందన్న విశ్వాసంతో యూపీ ప్రజలు ఉన్నారన్నారు. యూపీలాగే.. పంజాబ్, ఉత్తరాఖండ్ ప్రజలు కూడా ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నారని మాయావతి అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు ప్రజల ప్రాథమిక సమస్యలైన పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి ప్రాథమిక సమస్యలను నిర్మూలించకుండా తమ వాక్చాతుర్యంతో ఓటర్లలో భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు
దుర్మార్గాలు చేసేవారిని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
అమరావతి నుంచి సినీ నటి నవనీత్ రాణాకు భాజపా టికెట్
అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సినీనటి నవనీత్ రాణా ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా