BJP: కేసీఆర్ నుంచి మేం అవినీతి నేర్చుకోవాలా? కుటుంబ పాలనా?: కేంద్రమంత్రులు ధ్వజం
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని.....
హైదరాబాద్: తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనపై కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని పీయూష్ గోయల్ ఆరోపించారు. గత 8 ఏళ్లుగా కేంద్రం తెలంగాణకు ఎన్నో నిధులు ఇచ్చిందన్నారు. హెచ్ఐసీసీ వేదికగా భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజూ కొనసాగాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రులు పీయుష్ గోయల్, కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో తెలంగాణపై ప్రకటనపై చర్చ సందర్భంగా స్థానిక నేత డీకే అరుణ ఇక్కడి పరిస్థితులను వివరించారని పీయూష్ తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగానూ రాష్ట్ర ప్రజలకు కష్టాలు ఎక్కువయ్యాయని ఆమె చెప్పారన్నారు.
‘‘తెలంగాణ కోసం ప్రజలు, యువత ప్రాణ త్యాగాలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదాలపైనే తెలంగాణ ఏర్పడింది. కానీ, ఈ విషయాలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మంత్రులు అధికారంలో ఉండి ప్రజలతో ఆడుకుంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత పెద్దఎత్తున నిధులు తెలంగాణకు వచ్చాయి. క్షేత్రస్థాయి వరకూ వీటిని అందించకుండా ప్రభుత్వం అక్రమాలు చేసింది. విద్య, వైద్యం తదితర అంశాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నీటి పారుదలకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులోనే పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశారు. ₹1.50లక్షల కోట్లను వెచ్చించినా ప్రాజెక్టు పూర్తి కాలేదు. పాలమూరు రంగారెడ్డి, నెట్టెంపాడు, దిండి ప్రాజెక్టుల్లో ఏదీ పూర్తి చేయలేదు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఆ పరిస్థితులు ఇప్పటికే కనిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా మంచి ఫలితాలు సాధించింది. దుబ్బాక నియోజకవర్గాన్ని భాజపా గెలుచుకుంది. తెలంగాణ ప్రజల ఆశల్ని, ఆపేక్షలను పూర్తి చేసే బాధ్యతను భాజపా తీసుకుంటుంది. తెలంగాణలోని కుటుంబ పాలనను అంతం చేసేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో స్థానిక భాజపా బృందం బాద్యత తీసుకుంటుంది’’ అని పీయూష్ గోయల్ తెలిపారు.
తెరాసది దిగజారుడు రాజకీయం: కిషన్ రెడ్డి
భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలను అడ్డుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేస్తోందో గడిచిన రెండు రోజులుగా బయట కనబడుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భాజపా సమావేశాల కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపైనా జరిమానాలు వేశారన్నారు. రాష్ట్రంలో తెరాస దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. హెచ్ఐసీసీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణాలో అభివృద్ధిని చూసి నేర్చుకోండి అంటూ తెరాస నేతలు చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్ నుంచి అవినీతిని నేర్చుకోవాలా? కుటుంబ పాలనను నేర్చుకోవాలో చెప్పాలి. తెరాస సర్కార్ స్టీరింగ్ అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఉంది. ప్రగతి భవన్లోకి మంత్రులకు ఎవరికీ ప్రవేశంలేదు. ఎంఐఎం నేత మాత్రం నేరుగా సీఎం వద్దకు వెళ్తారు. నెలలో 20 రోజులు సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉంటారు. సచివాలయానికి రాని సీఎం దేశంలో కేసీఆర్ ఒక్కరే. వాస్తు పేరుతో సచివాలయం కూలగొట్టి వందల కోట్లు వృథా చేశారు’’ అని ఆరోపించారు.
‘‘గడిచిన 8 ఏళ్లుగా హోర్డింగ్లు, ప్రకటనల ప్రచార పాలనే నడుస్తోంది. తెరాస ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఎలా మాట్లాడాలన్న దానిపైనే కేసీఆర్ సర్కార్ ఆలోచిస్తోంది. కుటుంబ పాలన పార్టీని విసిరేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యమే లేదు. భాజపా తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీ తప్ప కుటుంబ పార్టీకి కాదు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తెరాస తీవ్రస్థాయిలో అక్రమాలకు పాల్పడింది. డబ్బులు కుమ్మరించింది. ప్రతి ఇంటికీ రూ.10వేలు చొప్పున పంచింది. అయినా ప్రజలు భాజపాకే ఓటేసి గెలిపించారు. ఓటు బ్యాంకు రాజకీయాలపైనే తెరాస ఆధారపడింది. దీనికి వ్యతిరేకంగా భాజపా పోరాడుతుంది. కుటుంబ పాలన పోయి భాజపా అధికారంలోకి రావాలని తెలంగాణ ప్రజలు కూడా భావిస్తున్నారు. గత ఐదేళ్ల పాలనతో కేబినెట్లో మహిళను చేర్చుకోని కేసీఆర్.. మాకు రాజకీయం నేర్పిస్తారా? దేశంలోనే అధికంగా పెట్రోల్ ధరలు తెలంగాణలోనే ఉన్నాయి’’ అని కిషన్రెడ్డి ధ్వజమెత్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయిదేళ్ల పాలనలో సర్వం నాశనం
కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం టెట్రా ప్యాకెట్ను చూపిస్తూ ‘మీ పాలన ఇదీ’ అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.. ఆ ప్యాకెట్ చూసి ఫ్రూట్ జ్యూస్ అనుకున్నానని చెప్పారు. -
అంతా సౌమ్యులే.. అక్రమాలకు కారకులెవరో?
కాకినాడ నుంచి లోక్సభకు వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న చలమలశెట్టి సునీల్తో పాటు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులంతా మంచివారు, సౌమ్యులని.. కొందరు తనకు స్నేహితులని జగన్ కొనియాడారు. -
వసుంధర రాజెను పట్టించుకోని భాజపా
రాజస్థాన్కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి తిరుగులేని నేతగా ఒక వెలుగు వెలిగిన వసుంధర రాజె ఊసే ఈ ఎన్నికల్లో కనిపించడం లేదు. ఆమెను భాజపా పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. -
సిట్టింగులు పోయి.. కొత్తోళ్లు
భాజపా 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 303 స్థానాల్లో జయభేరి మోగించింది. ఆ సిట్టింగ్ సీట్లలో ఈసారి ఇప్పటివరకు 130 చోట్ల వేర్వేరు కారణాల వల్ల అభ్యర్థులను మార్చింది. -
ప్రపంచాన యుద్ధమేఘాలు.. బలమైన భాజపా సర్కార్ అవసరం
ప్రపంచంలో ప్రస్తుతం యుద్ధమేఘాలు ఆవరించాయని, ఈ పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలు కాపాడాలంటే కేంద్రంలో బలమైన, స్థిరమైన భాజపా ప్రభుత్వం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. -
సమయానికి ‘108’ రాకే రాజాంలో బాలుడి మృతి
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపా ప్రచారరథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతిచెందిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
జగన్పై రాయి దాడి కేసులో సెక్షన్ 307 వర్తించదు
సీఎం జగన్పై హత్యాయత్నమే జరగనప్పుడు నిందితుల మీద 307 సెక్షన్ ఎలా బనాయిస్తారని తెదేపా నేతలు ప్రశ్నించారు. చిన్న రాయితో హత్యాయత్నానికి ప్రయత్నించాడని ఓ అమాయకుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా అరెస్టు చేశారని ఆరోపించారు. -
షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసు
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఆమె వివేకా హత్యను ప్రస్తావించి వైకాపాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు అవినాష్రెడ్డి, మల్లాది విష్ణు, వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఎన్నికల సంఘానికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. -
రాయి దాడి హత్యాయత్నం కాదు.. జగన్ నాటకం: వర్ల రామయ్య
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి హత్యాయత్నం కాదని..ఇదంతా ఆయన ఆడుతున్న నాటకమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దరఖాస్తుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయడం లేదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్పై చర్యలు తీసుకోవాలి
జనసేన అధినేత పవన్కల్యాణ్ను ఉద్దేశించి ఈ నెల 16న భీమవరం సభలో సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనాకు ఆ పార్టీ నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు
-
మహా సంక్లిష్టం!
పశ్చిమ కనుమల్లో కమల వికాసం అంత సులభంగా లేదు. అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో భాజపాకు ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాబోవడం లేదు. -
మోదీ మూడోవిడతకే ఈ ఎన్నికలు
ప్రధాని నరేంద్రమోదీకి మూడో విడత అవకాశం ఇచ్చేందుకు ఈ విడత సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
ఈవీఎంలపై సందేహాలొద్దు.. పెద్దఎత్తున ఓట్లేయండి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పౌరులకు సూచించారు. -
ప్రజలు ఎన్డీయే అభ్యర్థులకు ఓటేశారు: మోదీ
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డుస్థాయిలో ఓటు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఒక్క ఓటరు కోసం పోలింగు సిబ్బంది 18 కిలోమీటర్లు అటవీప్రాంతంలో ప్రయాణించి ఎడమలక్కుడి అనే కుగ్రామానికి చేరుకున్నారు. -
మహిళలకు జై
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజద) అధినేత నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు
లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. -
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
ఎన్టీఆర్ భవన్లో తెదేపా గీతాల ఆవిష్కరణ
సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్ వారియర్స్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆవిష్కరించారు.