
Revanth reddy: పేదల పక్షాన పోరాడే దళపతి దొరికింది: రేవంత్ రెడ్డి
కాంగ్రెస్లో చేరిన పీజేఆర్ కుమార్తె
హైదరాబాద్: దివంగత పి.జనార్దన్ రెడ్డి (పీజేఆర్) కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవల తెరాస పార్టీకి రాజీనామా చేసిన ఆమె.. ఇవాళ పెద్దఎత్తున తన అనుచరులతో కలిసి గాంధీభవన్కు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా పీజేఆర్ సేవలను నేతలు కొనియాడారు. పీజేఆర్ పేరు తెలియని వారు ఉండరని, పేదలకు పెద్దన్న పీజేఆర్ అని రేవంత్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఎన్నో బస్తీలు ఆయన కృషితోనే వెలిశాయని, ప్రజల కోసం సొంత పార్టీని కూడా నిలదీయడానికి పీజేఆర్ వెనుకాడలేదని వివరించారు.
ఎక్కడ పోటీ చేసినా విజయారెడ్డి గెలుస్తుంది..
‘‘పీజేఆర్ లేని లోటు ప్రస్తుత తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోంది. నగరంలో నేడు మహిళలకు, పేదలకు రక్షణ లేదు. ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదు. బస్తీ ప్రజల పక్షాన పోరాడేందుకు నాయకత్వం అవసరం. అందుకోసమే విజయారెడ్డి కాంగ్రెస్లో చేరారు. హైదరాబాద్ పేద ప్రజల పక్షాన పోరాడే దళపతి మాకు దొరికింది. విజయారెడ్డికి పార్టీలో మంచి గౌరవం దక్కుతుంది’’ అని రేవంత్రెడ్డి వెల్లడించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడం సంతోషం. పీజేఆర్ కూతురుగా విజయారెడ్డికి మంచి భవిష్యత్ ఉంది. ఖైరతాబాద్ సహా ఎక్కడ పోటీ చేసినా ఆమె గెలుస్తుంది. కాంగ్రెస్ను గెలిపించుకుంటేనే పీజేఆర్కు నిజమైన నివాళి’’ అని పేర్కొన్నారు.
3రంగుల జెండా వదలను: విజయారెడ్డి
ఖైరతాబాద్ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని కార్పొరేటర్ విజయారెడ్డి అన్నారు. పార్టీ మారడం ఒక్క రోజు తీసుకున్న నిర్ణయం కాదని, ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఘటనలు తీవ్రంగా బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. షీ టీమ్లు పెట్టామని గొప్పగా చెబుతున్నా.. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయన్నారు. ‘‘పెన్షన్, రేషన్ కార్డుల కోసం పేదలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రజల బాగోగులు పక్కన పెట్టారు. కాంగ్రెస్ మాత్రమే పేదలకు న్యాయం చేస్తుంది. అందువల్లే సోనియా, రాహుల్ నాయకత్వంలో పని చేయడానికి వచ్చాను. నేను పదవుల కోసం పార్టీ మారలేదు. ఇక 3 రంగుల జెండా వదలను. నాది ఇక ఒకటే జెండా..ఒకటే బాట’’ అని విజయారెడ్డి స్పష్టం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
-
Ap-top-news News
Andhra News: కలెక్టరమ్మా... కాలువల మధ్య ఇళ్లు కట్టలేమమ్మా!
-
Crime News
Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
-
General News
Heavy Rains: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
-
India News
Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
- Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
- America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
- IND vs ENG: నాలుగో రోజు ముగిసిన ఆట.. భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సిందే!
- అంకురాల్లో అట్టడుగున