Vijayareddy: తెరాసకు షాక్.. కాంగ్రెస్‌లోకి పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి

పీజేఆర్ కుమార్తె, తెరాస ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా ఉన్న విజయారెడ్డి గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.

Updated : 18 Jun 2022 12:37 IST

హైదరాబాద్‌: పీజేఆర్ కుమార్తె, తెరాస ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా ఉన్న విజయారెడ్డి గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 23న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. పీజేఆర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు విజయారెడ్డి వెల్లడించారు. సోనియాగాంధీ నాయకత్వంలో ముందుకెళ్తానన్నారు.

తనకు మంచి భవిష్యత్తు ఉంటుందని కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు విజయారెడ్డి వివరించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయమని చెప్పారు. తమ కుటుంబం ముందు నుంచి కాంగ్రెస్‌లోనే ఉందని.. ఆ పార్టీలో సాగితేనే బాగుంటుందని ఆమె తెలిపారు. అందరితో చర్చించాకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయారెడ్డి వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని