మోదీకి పాలించే నైతిక హక్కు లేదు: సిబల్
దేశాన్ని పాలించే నైతిక హక్కును ప్రధాని మోదీ కోల్పోయారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ అన్నారు. కరోనా సెకండ్వేవ్ వేళ దేశ ప్రజలంతా వైద్య సాయంకోసం ఎదురు చూస్తుంటే ఆయన రాజకీయాల కోసం వెంపర్లాడారని దుయ్యబట్టారు
దిల్లీ: దేశాన్ని పాలించే నైతిక హక్కును ప్రధాని మోదీ కోల్పోయారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ అన్నారు. కరోనా సెకండ్వేవ్ వేళ దేశ ప్రజలంతా వైద్య సాయంకోసం ఎదురు చూస్తుంటే ఆయన రాజకీయాల కోసం వెంపర్లాడారని దుయ్యబట్టారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కేంద్రంపై విరుచుకుపడ్డారు.
కొవిడ్ సెకండ్ వేవ్ సందర్భంగా ఆస్పత్రుల వద్ద పడిగాపులు కాస్తున్న ప్రజల పక్షాన ఉండాల్సిన ప్రధాని.. పశ్చిమ్ బెంగాల్, అసాం వంటి రాష్ట్రాల రాజకీయాల్లో బిజీగా గడిపారని సిబల్ ఎద్దేవా చేశారు. అందుకే ఆయనకు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. ప్రస్తుతం ఆయనకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కూడా లేకుండా పోయిందని అంగీకరించారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు తేవాల్సిన అవసరాన్ని తాను గుర్తు చేస్తున్నానని అన్నారు.
స్వీయ తప్పిదాలను కప్పిపుచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇతరులపై ఆ నెపాన్ని నెట్టేస్తోందని సిబల్ అన్నారు. తన ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ‘టూల్ కిట్’ అంశాన్ని సాధనంగా వాడుకుందని విమర్శించారు. తొలిదశ తర్వాత సెకండ్ వేవ్ వచ్చేనాటికి వైద్యపరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిని సైతం పెంచేందుకు కృషి చేయలేదని ఆరోపించారు. ప్రపంచమంతా వ్యాక్సినేషన్ గురించి ఆలోచన చేస్తే.. మోదీ ప్రభుత్వం 2021 జనవరి వరకు వ్యాక్సిన్లకు ఆర్డర్ పెట్టలేదన్నారు. వ్యాక్సిన్ల కొరతపై విమర్శలను రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టే ప్రయత్నం చేసిందని సిబల్ ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...