Gujarat Election 2022: ఇక్కడి ఉప్పు తిని.. ఈ రాష్ట్రంపైనే విమర్శలా?: ప్రధాని మోదీ
ప్రజలు అధికారానికి దూరం చేసిన పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు దేశంలో యాత్రలు చేస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. సోమవారం గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని, రాహుల్ జోడో యాత్రను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
సురేంద్రనగర్: ఎన్నో ఏళ్ల క్రితం అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సురేంద్రనగర్ ప్రాంతంలో నిర్వహించిన సభలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్పై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘ఈ రాష్ట్రంలో తయారైన ఉప్పు తిని కొందరు గుజరాత్పైనే విమర్శలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఉప్పులో 80 శాతం గుజరాత్లోనే తయారవుతోంది’’ అని అన్నారు.
‘‘ఎన్నో ఏళ్ల క్రితమే ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరంచేశారు. కానీ, ఆ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కొందరు పాదయాత్రలు చేస్తున్నారు. ఈ యాత్రలో నర్మదా ప్రాజెక్ట్ను 40 ఏళ్లపాటు అడ్డుకున్న వ్యక్తులతో కలిసి నడుస్తున్నారు’’ అని రాహుల్ను ఉద్దేశించి ప్రధాని విమర్శలు చేశారు. కొద్దిరోజుల క్రితం మహారాష్ట్రలో నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు మేధా పాట్కర్, రాహుల్ గాంధీతో కలిసి జోడో యాత్రలో పాల్గొన్నారు. ‘‘కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి గురించి మాట్లాడకుండా.. మోదీకి, తామెంటో చూపిస్తామని ప్రచారం చేస్తున్నారు. అది వారి అహంకారానికి నిదర్శనం. కానీ, నాకు ఎలాంటి హోదా లేదు.. నేను ప్రజల సేవకుణ్ని’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
సోమవారం ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, దిల్లీ సీఎం కేజ్రీవాల్ గుజరాత్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. డిసెంబరు 1, 5 తేదీల్లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబరు 8న ఫలితాలు వెల్లడించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు