భాజపా కీలక సమావేశానికి ప్రధాని మోదీ
శ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి కీలక రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ భారతీయ జనతా పార్టీ ఆదివారం కీలక సమావేశం నిర్వహించింది. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీ..
దిల్లీ: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి కీలక రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ భారతీయ జనతా పార్టీ ఆదివారం కీలక సమావేశం నిర్వహించింది. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. కొత్తగా నియమితులైన పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యులతో పాటు రాష్ట్రాల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో దాదాపు ఏడాది తర్వాత జరిగిన ప్రత్యక్ష సమావేశం ఇదే కావడం గమనార్హం.
ఐదురాష్ట్రాల ఎన్నికలు ప్రధాన అజెండాగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ప్రధాని మోద కరోనా కారణంగా మరణించిన వారికి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నేతలనుద్దేశించి మాట్లాడారు. ఎన్నికలతో పాటు వ్యవసాయ చట్టాలు, ఆత్మనిర్భర్ భారత్ గురించి చర్చించినట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్సింగ్ మీడియాకు వెల్లడించారు. ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు.ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ అధికార పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న భాజపా అందుకు అనుగుణంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీంతో పాటు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. అసోంలో రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ