PM Modi: కుటుంబ పాలనలో తెలంగాణ బందీ: ప్రధాని మోదీ
పట్టుదలకు, పౌరుషానికి మారు పేరు తెలంగాణ ప్రజలు అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తానెప్పుడు రాష్ట్రానికి వచ్చినా అపూర్వ స్వాగతం పలుకుతున్నారని చెప్పారు.
హైదరాబాద్: పట్టుదలకు, పౌరుషానికి మారు పేరు తెలంగాణ ప్రజలు అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తానెప్పుడు రాష్ట్రానికి వచ్చినా అపూర్వ స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా బేగంపేట విమానాశ్రయంతో దిగిన ప్రధాని.. అక్కడ భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత సభలో పాల్గొని మాట్లాడారు.
‘‘తెలంగాణ ఉద్యమంలో వేల మంది అమరులయ్యారు. అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. వారి ఆశయాలు నెరవేర్చాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం భాజపా కార్యకర్తలు కృషి చేస్తున్నారు. భారతదేశ ఐక్యత కోసం సర్దార్ పటేల్ ఎంతో కృషి చేశారు. ఒక ఆశయం కోసం వేలమంది ప్రాణత్యాగాలు చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరులతో పాటు ఎవరి ఆశయాలు కూడా నెరవేరడం లేదు. కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయింది. కేవలం ఒక కుటుంబం కోసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరగలేదు.
రాష్ట్రంలో భాజపా హవా.. అధికారంలోకి వచ్చి తీరుతాం..
కుటుంబ పార్టీలను తరిమితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి. తెలంగాణలో అధికార మార్పిడి తప్పక జరుగుతుంది. రాష్ట్రంలో భాజపా హవా కనిపిస్తోంది. ఇక్కడ కూడా అధికారంలోకి వచ్చితీరుతుంది. తెలంగాణ అభివృద్ధి కోసం ఎంత పోరాటమైనా చేస్తాం. యువతతో కలిసి అభివృద్ధి పథంలోకి నడిపిస్తాం. సబ్కా సాత్, సబ్కా వికాస్,సబ్కా విశ్వాస్ సూత్రంతో భాజపా పనిచేస్తోంది. కుటుంబపాలన, అవినీతి వల్ల అభివృద్ధి జరగడం లేదు. తెలంగాణ ప్రజలు ఎంత సమర్థులో నాకు తెలుసు. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా దూసుకెళ్తున్నాం. ఈ 8 ఏళ్లలో వేల స్టార్టప్లను ప్రోత్సహించాం’’ అని మోదీ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు