ఆ సర్టిఫికెట్లపైనా ప్రధాని ఫొటో వేయండి..!
ఎన్డీయే బిహార్ కూటమిలో ఫొటోల రగడ మొదలైంది. కరోనా కట్టడిలో భాగంగా చేపట్టిన వ్యాక్సినేషన్కు సంబంధించిన సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫొటో ఉండటంపై బిహార్ మాజీ ముఖ్యమంత్రి,
పట్నా: ఎన్డీయే బిహార్ కూటమిలో ఫొటోల రగడ మొదలైంది. కరోనా కట్టడిలో భాగంగా చేపట్టిన వ్యాక్సినేషన్కు సంబంధించిన సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫొటో ఉండటంపై బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ ఆవామ్ మోర్చా(హెచ్ఏఎమ్) అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ ట్విటర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. సర్టిఫికెట్లపై ఫొటోలు ప్రచురించడం ద్వారా టీకా పంపిణీతో వచ్చే ప్రతిష్ఠను తన ఖాతాలో వేసుకొనేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనాతో మృతి చెందినవారి మరణ ధ్రువీకరణ పత్రాలపైనా ప్రధాని ఫొటో వేయాలని ఎద్దేవా చేస్తూ ట్వీట్
చేశారు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఝార్ఖండ్ లాంటి భాజపాయేతర పార్టీ పాలిత రాష్ట్రాల్లోనూ ఫొటో రాజకీయాలు జోరందుకున్నాయి. తాము కూడా ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్లను తెప్పించేందుకు కృషి చేశామని, దీంతో వచ్చే ప్రతిష్ఠ తమకూ దక్కాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుకుంటున్నారు. బిహార్కు అత్యవసర ఔషధాలు, టీకాలు, ఆక్సిజన్, నిధుల కేటాయింపులో కేంద్రం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఇటీవల మాంఝీ విమర్శలు చేశారు. ‘‘మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు రూ.5 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని 2020 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం. లాక్డౌన్తో రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా కుదేలయ్యారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హామీ ఇచ్చిన ప్రకారం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భృతిని మంజూరు చేయాలని సీఎం నీతీశ్ కుమార్ను కోరాను’’ అని మాంఝీ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్