ఎన్నికల వేళ నాలుగు భాషల్లో మోదీ ట్వీట్లు
పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరిలో మంగళవారం ఎన్నికలు ప్రారంభమైన నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ప్రధాని మోదీ ఓటర్లును అభ్యర్థించారు. బెంగాలీ, మళయాళం, తమిళం, ఆంగ్లంలో ట్వీట్లు చేస్తూ....
ఓటు హక్కు నివియోగించుకోవాలని అభ్యర్థన
దిల్లీ: పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరిలో మంగళవారం ఎన్నికలు ప్రారంభమైన నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ప్రధాని మోదీ ఓటర్లును అభ్యర్థించారు. బెంగాలీ, మళయాళం, తమిళం, ఆంగ్లంలో ట్వీట్లు చేస్తూ ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. రికార్డు స్థాయిలో ఓటు శాతం నమోదు కావాలని, ముఖ్యంగా యువత ఓటు వేసేందుకు ముందుకు రావాలని పేర్కొన్నారు.
బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఇవి మూడో విడత ఎన్నికలు. అస్సాంలో ఈ విడతతో పోలింగ్ పూర్తికానుంది. బెంగాల్లో నాలుగో విడత ఎన్నికలు ఈ నెల 10న జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి.
నాలుగు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరిలోనూ ఈరోజు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 475 స్థానాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 20 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 9 గంటలకల్లా బెంగాల్లో 14.62 శాతం, అస్సాంలో 12.83 శాతం, తమిళనాడులో 13.8 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా