ఎన్నికల వేళ నాలుగు భాషల్లో మోదీ ట్వీట్లు

పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరిలో మంగళవారం ఎన్నికలు ప్రారంభమైన నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ప్రధాని మోదీ ఓటర్లును అభ్యర్థించారు. బెంగాలీ, మళయాళం, తమిళం, ఆంగ్లంలో ట్వీట్లు చేస్తూ....

Updated : 06 Apr 2021 12:07 IST

ఓటు హక్కు నివియోగించుకోవాలని అభ్యర్థన

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరిలో మంగళవారం ఎన్నికలు ప్రారంభమైన నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ప్రధాని మోదీ ఓటర్లును అభ్యర్థించారు. బెంగాలీ, మళయాళం, తమిళం, ఆంగ్లంలో ట్వీట్లు చేస్తూ ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. రికార్డు స్థాయిలో ఓటు శాతం నమోదు కావాలని, ముఖ్యంగా యువత ఓటు వేసేందుకు ముందుకు రావాలని పేర్కొన్నారు.

బెంగాల్‌, అస్సాం రాష్ట్రాల్లో ఇవి మూడో విడత ఎన్నికలు. అస్సాంలో ఈ విడతతో పోలింగ్‌ పూర్తికానుంది. బెంగాల్‌లో నాలుగో విడత ఎన్నికలు ఈ నెల 10న జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి.

నాలుగు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరిలోనూ ఈరోజు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 475 స్థానాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 20 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 9 గంటలకల్లా బెంగాల్‌లో 14.62 శాతం, అస్సాంలో 12.83 శాతం, తమిళనాడులో 13.8 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని