Ayyanna patrudu: తెదేపా నేత అయ్యన్నపాత్రుడి ఇంటికి మరోసారి పోలీసులు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడి ఇంటికి గురువారం రాత్రి విశాఖ సిటీ పోలీసులు వెళ్లారు. అయ్యన్నపాత్రుడికి సెక్షన్అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడి ఇంటికి గురువారం రాత్రి విశాఖ సిటీ పోలీసులు వెళ్లారు. అయ్యన్నపాత్రుడికి
నర్సీపట్నం: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడి ఇంటికి గురువారం రాత్రి విశాఖ సిటీ పోలీసులు వెళ్లారు. అయ్యన్నపాత్రుడికి సెక్షన్ 41కింద నోటీసులు ఇవ్వడానికి పోలీసులు రాగా... ఆయన ఇంటి వద్ద లేకపోవడంతో వెనుదిరిగారు. చోడవరం మినీ మహానాడులో అయ్యన్న ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారని 5రోజుల క్రితం గుంటూరు పోలీసులు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆరోజు ఆయన ఇంటి వద్ద లేకపోవడంతో వెనుదిరిగారు. అయ్యన్నపై ప్రభుత్వం కక్షసాధిస్తోందని, ఎలాగైనా అరెస్టు చేయాలని పోలీసులు చూస్తున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.