ఏపీ ‘పంచాయతీ’.. నేతల మాటల యుద్ధం
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రోజురోజుకూ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు.. ఎన్నికలు నిర్వహించి తీరుతామని రాష్ట్ర ఎన్నికల సంఘం మరోవైపు.. ఇలా రాష్ట్రంలో ప్రస్తుతం...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రోజురోజుకూ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు.. ఎన్నికలు నిర్వహించి తీరుతామని రాష్ట్ర ఎన్నికల సంఘం మరోవైపు.. ఇలా ఏపీలో ప్రస్తుతం వాడీవేడి పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు సైతం ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు విముఖత చూపిస్తున్నాయి. ఇదేం లెక్కచేయకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్కుమార్ రాష్ట్ర స్థాయి అధికారులతో నిర్వహించాలనుకున్న వీడియో కాన్ఫరెన్స్కు సీఎస్, డీజీపీ, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు, కొన్ని జిల్లాల అధికారులు గైర్హాజరయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఓవైపు అధికార వైకాపా నేతలు ఎస్ఈసీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంటే.. ఎన్నికల నిర్వహణను అడ్డుకుంటుందని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికలు జరిగితే తమ ఓట్ల ద్వారా వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.
ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు: పెద్దిరెడ్డి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. ఎన్నికల కంటే కొవిడ్ వ్యాక్సినేషన్ ముఖ్యమైనదన్నారు. గతంలో ఎన్నికలను నిమ్మగడ్డ స్వార్థంతో వాయిదా వేశారని విమర్శించారు. ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెబుతుందో ఎస్ఈసీ ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. తెదేపా అధినేత చంద్రబాబు ఎన్నికుట్రలు చేసినా ఎప్పటికీ అధికారం చేజిక్కించుకోలేరన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత తెదేపా ఎక్కడ కనిపించదని ఎద్దేవా చేశారు.
పెద్దిరెడ్డికి ఎందుకు భయం: అచ్చెన్నాయుడు
‘‘స్వేచ్ఛాయుత ఎన్నికలంటే మంత్రి పెద్దిరెడ్డికి ఎందుకు భయం?స్వేచ్ఛగా పంచాయతీ ఎన్నికలు జరిగితే వైకాపాకి ప్రజలు బుద్ధి చెబుతారనే భయంతో ఉన్నారు. ప్రజాబలం వైకాపాకు ఉంటే ఎస్ఈసీకి ఎందుకు భయపడుతున్నారు?ఎస్ఈసీకి ఉద్యోగులు సహకరించకూడదంటూ పెద్దిరెడ్డి చెప్పడం రాజ్యాంగ విరుద్ధం. కరోనా వ్యాక్సిన్ కుంటిసాకు మాత్రమే. స్వేచ్ఛాయుత ఎన్నికలంటే వైకాపాకు జ్వరం వచ్చినట్టుగా ఉంది’’ అని తెలిపారు.
రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు: అంబటి
‘‘ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే చెబుతోంది. అయినప్పటికీ లెక్కచేయకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పంథాలో ముందుకెళ్తున్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారు. 2018 నుంచి ఎన్నికలు నిర్వహించలేకపోయిన ఎస్ఈసీ మూడు నెలల్లోనే నిర్వహించాలని పట్టుదలతో వ్యవహరించడం సరికాదు. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే కొవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతోన్న సమయంలో ఎన్నికలు సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తూ వద్దంటున్నాం. వాక్సినేషన్ పూర్తైన వెంటనే ఎన్నికలు జరపాలని ప్రభుత్వం కోరుతున్నా ఎస్ఈసీ వినడం లేదు’’ అని అంబటి వ్యాఖ్యానించారు.
ప్రాణాలు పోతే ఎవరి బాధ్యత: తమ్మినేని సీతారాం
‘‘పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్ష నిర్ణయం సరైంది కాదు. ఎన్నికల్లో కరోనా సోకి ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు. ఎవరికోసం ఎస్ఈసీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నారు. వ్యాక్సినేషన్ పూర్తయ్యాక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రకృతి విపత్తులను న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుంది. దీనిపై అవసరమైతే ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి’’ అని సభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు.
భయపడే ప్రసక్తే లేదు: ఎంపీ రామ్మోహన్నాయుడు
‘‘పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ సీఎం జగన్మోహన్రెడ్డికి చెంపపెట్టు లాంటిది. సీఎం జగన్ ఎన్నికలు నిర్వహించేందుకు భయపడుతున్నారు. ప్రజల్లో వ్యతిరేకతతోనే ఎన్నికలంటే వైకాపా భయపడుతోంది. పంచాయతీ ఎన్నికల్లో తెదేపా సత్తా చాటుతుంది. భయపడే ప్రసక్తే లేదు. క్షేత్రస్థాయిలో తెదేపా బలం ఏ మేరకు ఉందో తెలిపేందుకు ఈ ఎన్నికలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటాం’’ అని ఎంపీ పేర్కొన్నారు.
రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తోంది: పట్టాభి
‘‘ప్రభుత్వం అకారణంగా రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తోంది. రాజ్యాంగ ప్రక్రియను జగన్ ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఎస్ఈసీపై ఎదురుదాడి చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పు పాటించకపోవడం కోర్టు ధిక్కరణే అవుతుంది. ఇంటిపట్టాల పంపిణీలో ఉద్యోగ సంఘాలకు వ్యాక్సిన్ గుర్తుకు రాలేదా? ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి ఎవరిని చంపుతారు?చంపుతామని బెదిరిస్తున్న వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి. తాడేపల్లి ప్యాలెస్కు బానిసలుగా మారి ఎవరిని బెదిరిస్తున్నారు?’’ అని పట్టాభి నిలదీశారు.
ఇవీ చదవండి..
మీ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే?
ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
Loksabha Elections: మొత్తం 102 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
భాజపా వైపు ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
వేమిరెడ్డి దంపతుల ఆస్తులు.. రూ.715.62 కోట్లు
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
అబ్బో.. కేసుల్లోనూ ఘనులే
చిత్తూరు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 12 కేసులున్నాయి. -
లోకేశ్ తరఫున నామినేషన్ దాఖలు
గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి, తెదేపా యువనేత నారా లోకేశ్ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను గురువారం రిటర్నింగ్ అధికారి రాజకుమారికి అందజేశారు. -
రైతులను అప్పుల్లో ముంచిన జగన్
సీఎం జగన్ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వాటిని కప్పిపుచ్చి ప్రోగ్రెస్ కార్డుల పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి వంచించడానికి వైకాపా నేతలు ప్రయత్నించడం సిగ్గుచేటని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. -
సీఎం జగన్ అవినీతిపై ఛార్జిషీట్ విడుదల చేస్తాం
ముఖ్యమంత్రి జగన్ అవినీతిపై ఛార్జ్షీట్ రూపొందిస్తామని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
తెదేపా శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు
నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలిరోజు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. -
‘నాడు-నేడు’ కార్యశాల పేరిట వైకాపా డప్పు
గ్రామ స్వరాజ్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉందని ప్రభుత్వ విశ్రాంత ముఖ్య కార్యదర్శి, సీఎం సలహాదారుడు అజేయ కల్లం పేర్కొన్నారు. -
నేడు నామినేషన్ వేయనున్న పురందేశ్వరి
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమహేంద్రవరం అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ వేయనున్నట్లు ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది. -
రాష్ట్రంలో నాలుగు చోట్ల మోదీ సభలు
ఎన్డీయే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ రాష్ట్రంలో నాలుగు బహిరంగ సభలకు హాజరుకానున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి