YS Sharmila: నేడు మెదక్‌ జిల్లాలో షర్మిల పర్యటన

తెలంగాణ అమరుల కుటుంబాలను పరామర్శించేందుకు బుధవారం ఉదయం వైఎస్‌ షర్మిల మెదక్‌ జిల్లాలో పర్యటించనున్నట్లు ఆమె కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని

Updated : 02 Jun 2021 08:01 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ అమరుల కుటుంబాలను పరామర్శించేందుకు బుధవారం ఉదయం వైఎస్‌ షర్మిల మెదక్‌ జిల్లాలో పర్యటించనున్నట్లు ఆమె కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వెల్దుర్తి మండలం శేరిల్లా గ్రామంలోని కుటుంబాలను కలిసి పరామర్శిస్తారని పేర్కొంది. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌ చేరుకుని గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారని ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని