పంజాబ్ రాజకీయం.. రేపు పీసీసీ కీలక భేటీ
పంజాబ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సిద్ధూకు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టనున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్ కీల.....
చండీగఢ్: పంజాబ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సిద్ధూకు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టనున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్ కీలక సమావేశానికి పిలుపునిచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. పార్టీ అధిష్ఠానం ఏం నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామంటూ ఈ భేటీలో తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపనున్నారు.
పంజాబ్లో అమరీందర్, సిద్ధూ మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించే దిశగా అధిష్ఠానం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. నవజ్యోత్సింగ్ సిద్ధూతో పాటు, కుల సమీకరణాల ఆధారంగా ఖాళీగా ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులను కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం భర్తీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు అమరీందర్కు మద్దతుగా 10 మంది ఎమ్మెల్యేలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అమరీందర్ను పదవి నుంచి తొలగించవద్దని వారు అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. నవజ్యోత్సింగ్ సిద్ధూ ఓ సెలబ్రిటీ అని, పార్టీకి ఆయన కూడా ప్రధాన బలం అని వారు తెలిపారు. అయితే, పలు సందర్భాల్లో ప్రభుత్వంపైనా, పార్టీపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు నష్టం కలిగించేవిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. తనకు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు సిద్ధూను కలిసేది లేదని అమరీందర్ కట్టుబడి ఉండడాన్ని వీరు సమర్థించారు. తమ నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే