‘ఆ ఎత్తిపోతలతో ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం’
రాయలసీమ ఎత్తిపోతలపై ప్రకాశం జిల్లా తెదేపా ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
సీఎం జగన్కు లేఖ రాసిన తెదేపా ఎమ్మెల్యేలు
అమరావతి: రాయలసీమ ఎత్తిపోతలపై ప్రకాశం జిల్లా తెదేపా ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం 40 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంపుపై అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజనేయ స్వామి, సాంబశివరావు సీఎం జగన్కు లేఖ రాశారు. ‘‘శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తెలంగాణ, సీమ ఎత్తిపోతల వల్ల జిల్లాకు తీవ్ర నష్టం కలుగుతుంది. పంట భూములన్నీ భూగర్భజలాలు, సాగర్పైనే ఆధారపడ్డాయి. శ్రీశైలం నిండకుండా ప్రాజెక్టులు కడితే మా పరిస్థితేంటి?గుంటూరు ఛానల్ దగ్గుబాడు వరకు పొడిగించి పొలాలకు నీళ్లివ్వాలి’’ అని లేఖలో పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లాలో 15 ఏళ్లలో మూడు సార్లే సాధారణ వర్షపాతం నమోదైందని.. పన్నెండేళ్లు కరవే అని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలతో మరింత చేటు జరిగేలా ఉందని చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల సామర్థ్యం పెంపు విషయంలో పునరాలోచించాలని ఎమ్మెల్యేలు సీఎంను కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు