UP Polls: ప్రియాంక గాంధీ ఒంటరి పోరాటం.. అయినా దక్కని ఫలితం..!
ఉత్తర్ప్రదేశ్లో మోదీ-యోగీ ద్వయం దాటికి ప్రియాంక గాంధీ ప్రచారాస్త్రాలు పనిచేయలేకపోయాయి.
ఉత్తర్ప్రదేశ్లో రెండు స్థానాలకు పడిపోయిన కాంగ్రెస్
లఖ్నవూ: దేశవ్యాప్తంగా గతకొంత కాలంగా ప్రాభవం కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీకి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ పరాభవం తప్పలేదు. ప్రాంతీయ పార్టీలు పుంజుకుంటున్నా కాంగ్రెస్ మాత్రం ఇదివరకు ఉన్న సీట్లనూ కోల్పోతోంది. గత ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ పార్టీకి ఏడు సీట్లు రాగా తాజా ఎన్నికల్లో రెండు స్థానాలకు దిగజారింది. పార్టీ తరపున అన్నీ తానై ఒంటరి పోరు కొనసాగిస్తూ ప్రియాంక గాంధీ చేసిన ప్రయత్నాలు.. పార్టీకి ఎటువంటి ప్రయోజనం కలిగించలేకపోయాయి. మోదీ-యోగీ ద్వయం ధాటికి కాంగ్రెస్ ప్రచారాస్త్రాలు పనిచేయకపోగా.. ఉన్నవాటినీ కోల్పోయేటట్లు చేశాయి.
అన్నీ తానై పోరాటం..
యూపీలో ఎన్నికల ప్రచారానికి ఈసారి అగ్రనేతలందరూ దూరంగానే ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, తనయుడు రాహుల్ గాంధీ సహా ఇతర దిగ్గజ కాంగ్రెస్ నాయకులు నామమాత్రం ప్రచారం నిర్వహించారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్న ప్రియాంక గాంధీ మాత్రమే అధికార, ప్రతిపక్ష పార్టీలపై ఒంటరి పోరాటం చేశారు. ముఖ్యంగా భాజపా, సమాజ్వాదీపార్టీల తీరును ఎండగడుతూ రాష్ట్రం మొత్తం కలియతిరిగారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో యోగీ అనుసరిస్తోన్న విధానాలను వ్యతిరేకిస్తూ ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతోన్న దాడులను ప్రస్తావిస్తూ యూపీ యువతులను కాంగ్రెస్ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. వీటికి తోడు ప్రియాంక గాంధీ ఛరిష్మాతో కాంగ్రెస్ చేపట్టిన ప్రచార కార్యక్రమాలకు భారీగానే స్పందన కనిపించింది. కానీ, చివరకు అవన్నీ ఓట్ల రూపంలోకి మారలేకపోవడంతో ప్రియాంక సాగించిన పోరాటం ఫలితం లేకుండానే ముగిసింది. దీంతో 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది.
ఫలించని వాగ్దానాలు..
యూపీ మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 40శాతం టికెట్లు కేవలం మహిళలకే కేటాయించిన కాంగ్రెస్ పార్టీ మహిళా ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించింది. భవిష్యత్తులో చేపట్టే పోలీసు నియామకాల్లోనూ మహిళలకు 25శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లుతో పాటు 25 నగరాల్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. వీటికితోడు అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే రైతుల రుణమాఫీ, 20లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వంటి హామీలతో ‘జన్ ఘోషనా పత్రా’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అయినప్పటికీ కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను యూపీ ప్రజలు లెక్క చేయలేదనే తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే