ఆక్సిజన్‌ కొరత కాదు.. సర్కారు నిర్లక్ష్యం వల్లే..!

కొవిడ్ 19 సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌ కొరతతో దేశంలో వైరస్‌ బాధితులెవరూ చనిపోలేదంటూ వెల్లడించిన కేంద్రంపై కాంగ్రెస్‌ అగ్ర నేత ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం మండిపడ్డారు.

Updated : 22 Jul 2021 04:13 IST

దిల్లీ: కొవిడ్ 19 సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌ కొరతతో దేశంలో వైరస్‌ బాధితులెవరూ చనిపోలేదంటూ వెల్లడించిన కేంద్రంపై కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం మండిపడ్డారు. ఆక్సిజన్‌ లేక కాదు.. దానిని అందజేయడంలో కేంద్రం అనుసరించిన నిర్లక్ష్య ధోరణితోనే చాలా మంది ప్రాణాలు కోల్పాయారని ఆమె ఆరోపించారు. నిజానికి మహమ్మారి వ్యాప్తి చెందుతున్న తరుణంలో దేశంలో ఆక్సిజన్‌ ఎగుమతులను ప్రభుత్వం 700 శాతం పెంచిందన్నారు. కానీ ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు కేంద్రం రవాణా సదుపాయం కల్పించకపోవడం వల్లే ఎక్కువ మరణాలు సంభవించాయంటూ విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై పార్లమెంటరీ కమిటీ సలహాలను సైతం కేంద్రం విస్మరించిందంటూ మండిపడ్డారు. రోగులకు ఆక్సిజన్ అందించడానికి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదని ఆరోపించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు దిశగా కేంద్రం చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

కొవిడ్ సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌ కొరతతో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నివేదికలు సమర్పించినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో వెల్లడించింది. కేంద్రం చేసిన ఈ ప్రకటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని