‘ఆమె ట్విటర్ వాద్రా.. కాంగ్రెస్కు మళ్లీ ఆ ఏడు సీట్లూ వస్తే గొప్పే!’
ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ నుంచి తమకు ఎలాంటి ప్రమాదం లేదని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు.....
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ నుంచి తమకు ఎలాంటి ప్రమాదం లేదని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. ప్రియాంకను 'ట్విట్టర్ వాద్రా'గా అభివర్ణించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం టికెట్లను మహిళలకు కేటాస్తామని కాంగ్రెస్ ప్రకటించడంపై స్పందిస్తూ.. కాంగ్రెస్ తన ఏడు స్థానాలను తిరిగి నిలబెట్టుకుంటే అదే గొప్ప అని ఎద్దేవా చేశారు.
‘ఉత్తర్ప్రదేశ్లో కాంగ్రెస్కు ఉనికి లేదు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ రెండు సీట్లలో గెలిచారు. 2019లో అది ఒకటికే పరిమితమైంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏడు సీట్లే సాధించింది. 2022లో ఈ సీట్లు నిలబెట్టుకుంటే.. కాంగ్రెస్కు అదే గొప్ప ఘనత అవుతుంది. ప్రియాంకను మీడియానే విపక్ష అభ్యర్థిగా చూస్తోంది. నేనైతే ప్రియాంకను ట్విట్టర్ వాద్రా అని భావిస్తా. ఫొటోలు దిగే నేతలు తప్ప.. కాంగ్రెస్లో ఎవరూ లేరు. ప్రియాంక అయినా, రాహుల్ అయినా అంతే’ అంటూ పేర్కన్నారు.
సమాజ్వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు కూడా భాజపా విజయానికి అడ్డుకాదని మౌర్య ధీమా వ్యక్తం చేశారు. 2017 ఎన్నికల్లో గెలిచిన స్థానాలను మళ్లీ సాధిస్తే.. వారు సంతోషించవచ్చని అన్నారు. ఈ పార్టీలు చేసిన అవినీతి, నేరాలు, మాఫియా రాజకీయాల గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ, ఎంఐఎం పార్టీలకు యూపీ ఎన్నికల్లో ప్రాధాన్యమే లేదని.. ఈ పార్టీలు ఓట్లను చీల్చేందుకే పోటీ చేస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో భాజపాకు ఎలాంటి సవాళ్లు ఎదురుకాబోవని మౌర్య అన్నారు. ఇచ్చిన హామీలను చాలా వరకు పార్టీ నెరవేర్చిందని, ఈసారి 325 కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దేశంలో సురక్షితమైన సీటు లేదని, భవిష్యత్తులో ఆయన మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
కేరళలోని వయనాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, భాజపాపై విమర్శలు గుప్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!