- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Priyanka Gandhi: ఎందుకు ఫెయిల్ అయ్యాం?: ప్రియాంకా గాంధీ
దిల్లీ: దేశ రాజకీయాల్లో కీలక రాష్ట్రమైన ఉత్తర్ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా సమీక్షలు మొదలుపెట్టారు. ఈ ఎన్నికల్లో పార్టీ పేలవమైన ప్రదర్శనకు గల కారణాలను విశ్లేషించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా గురువారం యూపీకి చెందిన పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలతో వ్యక్తిగతంగా భేటీ అయిన ప్రియాంక.. యూపీ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు విఫలమైందని వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ కేవలం రెండంటే రెండు సీట్లకే పరిమితమైపోయిన విషయం తెలిసిందే. హస్తం పార్టీకి 2.33 శాతం ఓట్లు మాత్రమే రాగా.. 97శాతం మంది కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. అలాగే, పంజాబ్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్లలోనూ పెద్దగా ప్రభావం చూపలేక డీలా పడిపోయిన విషయం తెలిసిందే.
యూపీలో మహిళల సమస్యలపై ప్రధానంగా దృష్టిసారించి ప్రచారానికి నాయకత్వం వహించిన ప్రియాంక గాంధీ వాద్రా.. కాంగ్రెస్ నేతలు ప్రమోద్ తివారీ, ఆచార్య ప్రమోద్ కృషన్, సతీశ్ అజ్మానీ, అజయ్ రాయ్, అజయ్ కుమార్ లల్లూ, విరేందర్ చౌధరి తదితరులతో సమావేశమయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల వ్యూహంపైనా వారితో చర్చించారు. ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ యూపీ నేతలతో ఇటీవల సమావేశం నిర్వహించిన ప్రియాంక.. ఇతర రాష్ట్రాల నేతలతోనూ త్వరలో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
-
General News
అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఎక్స్ఛేంజ్లో విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు
-
India News
CBI searches: రూ.11కోట్ల నాణేలు అదృశ్యం.. 25చోట్ల సీబీఐ సోదాలు
-
Politics News
Subramanian Swamy: భాజపాలో ఎన్నికల్లేవ్.. అంతా ‘మోదీ’ ఆమోదంతోనే..!
-
General News
Andhra News: సీపీఎస్ కంటే జీపీఎస్ మరింత ప్రమాదకరం: ఉద్యోగ సంఘాలు
-
Movies News
Chiranjeevi: మెగా హీరోలను కలవాలనుకుంటున్నారా? మీకిదే అవకాశం!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vinod kambli: బీసీసీఐ పింఛనే నాకు దిక్కు.. సచిన్ నుంచి ఏమీ ఆశించట్లేదు: వినోద్ కాంబ్లి
- Madhavan: ‘రాకెట్రీ.. మాధవన్ ఇంటిని కోల్పోయాడు’
- Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
- Liger: ‘లైగర్’ సినిమా.. ఏడు అభ్యంతరాలు చెప్పిన సెన్సార్ బోర్డ్
- Thiru review: రివ్యూ: తిరు
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- Jammu: ఉగ్రవాది అతితెలివి.. ఎన్కౌంటర్ చేసిన పోలీసులు
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Vizag: విశాఖలో రౌడీషీటర్ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం