Rahul Gandhi: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్దే పైచేయి..! తెలంగాణలో భాజపాపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావొచ్చని పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్లకు జనగణన, డీలిమిటేషన్లతో సంబంధం లేదన్నారు.
దిల్లీ: రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) మంచి ఫలితాలు సాధిస్తుందని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. తెలంగాణలోనూ అధికారంలోకి రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో పార్టీ విజయం ఖాయమని, రాజస్థాన్లో చాలా దగ్గరి పోటీ ఉందని, అయినప్పటికీ గెలుపొందుతామన్నారు. ఓ వార్తాసంస్థ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఈ మేరకు మాట్లాడారు. తెలంగాణలో భాజపా (BJP) క్షీణించిందని.. అక్కడ ఆ పార్టీ పనైపోయిందని వ్యాఖ్యానించారు. మరికొన్ని నెలల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మిజోరంలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
కుల గణనకు భయమెందుకు?: రాహుల్ గాంధీ
‘దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే జమిలి ఎన్నికలు, దేశం పేరు మార్పు, రమేశ్ బిధూరి వ్యవహారం వంటివాటిని భాజపా తెరపైకి తెస్తోంది. అదానీ వ్యవహారంపై వచ్చిన మీడియా కథనాల నుంచి దృష్టి మళ్లించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. కుల గణన డిమాండ్ నుంచి తప్పించుకునేందుకు లోక్సభలో భాజపా ఎంపీ రమేశ్ బిధూరి వ్యవహారాన్ని తీసుకొచ్చింది. అయితే.. ఈ తరహా వ్యూహాలను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నాం. కర్ణాటక ఎన్నికల్లో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేశాం’ అని రాహుల్ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లకు జనగణన, డీలిమిటేషన్లతో సంబంధం లేదని.. రేపు ఉదయాన్నే ఈ రిజర్వేషన్లను అమలు చేయొచ్చన్నారు.
2024లో ఆశ్చర్యకర ఫలితాలు..
ప్రస్తుతం విపక్షాలన్నీ కలిసికట్టుగా పని చేస్తున్నాయని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఆశ్చర్యానికి గురవుతుందని రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర నుంచి నేర్చుకున్న విషయాల గురించి మాట్లాడుతూ.. ‘భారత్లో ప్రసార మాధ్యమాలపై భాజపా పట్టుసాధించింది. ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా వక్రీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహాత్మా గాంధీ చూపిన బాటలో.. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యాను. ఈ పాత విధానం నేటికీ పనిచేస్తుందని తెలుసుకున్నా’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Rahul Gandhi: కాంగ్రెస్ సర్కార్ చేతిలో భద్రంగా యువత భవిష్యత్తు: రాహుల్
తెలంగాణలో నిరుద్యోగ యువత పడుతున్న ఇబ్బందులపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. -
YSRCP MLC: వైకాపా ఎమ్మెల్సీ మూడో పెళ్లికి.. రెండో భార్య సాక్షి సంతకం
వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. -
Yuvagalam: మంత్రులూ.. మీకు కౌంట్డౌన్ మొదలైంది: నారా లోకేశ్
వ్యవస్థలను మేనేజ్ చేసి తెదేపా అధినేత చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. -
Yuvagalam: పొదలాడ నుంచి నారా లోకేశ్ ‘యువగళం’ పునః ప్రారంభం
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర మళ్లీ ప్రారంభమైంది. -
మథురలో కృష్ణుడి ఆలయంపై మీ వైఖరేంటో చెప్పండి
ఉత్తర్ప్రదేశ్లోని మథురలో శ్రీకృష్ణుడి ఆలయాన్ని నిర్మించడం సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)కి ఇష్టంలేదని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఆరోపించారు. -
11 ఏళ్లలో మాపై 250 కేసులు నమోదు చేశారు
దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తోన్న పార్టీ ఆమ్ఆద్మీ(ఆప్) అని ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
వైకాపా నాయకుల స్వలాభంతో పేదలకు అన్యాయం
కాసులకు కక్కుర్తి పడిన వైకాపా నాయకులు చౌడు నేలలు, క్వారీల బాంబ్ బ్లాస్టింగ్లు జరిగే ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ తెదేపా బాధ్యుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మండిపడ్డారు. -
Yuvagalam: నేటి నుంచి కోనసీమలో ‘యువగళం’
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం నుంచి ‘యువగళం’ పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు. -
మరి ఆ సంస్థ ఎలా తవ్వుతుంది?
ఆంధ్రప్రదేశ్లో ఇసుక టెండరు కాల పరిమితి ముగిసిందని జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలకు(ఎన్ఎస్ఈ, బీఎస్ఈ) ఇచ్చిన నివేదికల్లో జేపీ పవర్ వెంచర్స్ సంస్థ స్పష్టం చేసిందని.. అయినా గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి మాత్రం పాత సంస్థ ఆధ్వర్యంలోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
ఓట్ల తొలగింపు కుట్రదారు.. మద్దాళి
‘గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు కుట్రదారు ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ అని బాహ్య ప్రపంచానికి తెలిసిపోయింది. -
నిలదీస్తే నిర్బంధం... ప్రశ్నిస్తే ప్రాణాలు తీయడం
రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులకు దిక్కులేదని.. నిలదీస్తే నిర్బంధం, ప్రశ్నిస్తే ప్రాణాలు తీసే అవినీతి, అరాచక పాలన సాగుతోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. -
దళిత బహుజనుల హత్యలకు జగన్దే బాధ్యత
వైకాపా పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల హత్యలు, వారిపై దారుణాలకు సీఎం జగన్దే బాధ్యతని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. -
ప్రజల విశ్వాసం కోల్పోయిన మోదీ
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలపై తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా ఇచ్చిన మాటను తప్పి ప్రధాని మోదీ ప్రజల విశ్వాసం కోల్పోయారని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విమర్శించారు. -
తెదేపా నేతల గృహ నిర్బంధం
పల్నాడు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ను పరిశీలించేందుకు సిద్ధమైన తెదేపా-జనసేన నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Chelluboyina Venugopal: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్కు గుండె నొప్పి
-
Supreme Court: వాలంటీర్ వ్యవస్థతో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కుట్ర: సిటిజన్ ఫర్ డెమోక్రసీ
-
IPL-2024: ఐపీఎల్లో ఆడాలని ఉంది: పాకిస్థాన్ బౌలర్
-
Social Look: నీటితో సమస్యలకు చెక్ అన్న అదా.. మీనాక్షి స్ట్రీట్ షాపింగ్
-
Gautam Singhania: కంపెనీ కార్యకలాపాలు యథాతథం.. వాటాదారులు, ఉద్యోగులకు గౌతమ్ సింఘానియా లేఖ