West Bengal: గొర్రెల మందతో రాజ్భవన్ ముట్టడి..!
రాజ్భవన్ ముందు గొర్రెల మందతో తృణమూల్ నేతలు నిరసన చేపట్టడంపై పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ తీవ్రంగా స్పందించారు.
తీవ్రంగా స్పందించిన గవర్నర్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో గవర్నర్ కార్యాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం మధ్య వివాదం ముదురుతోంది. ఇద్దరు మంత్రులతో సహా మరో ఇద్దరు తృణమూల్ నేతలు అరెస్ట్ కావడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు గవర్నర్ జగదీప్ ధన్కడ్ ప్రయత్నిస్తున్నారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించడం తృణమూల్ నేతల్లో ఆగ్రహానికి కారణమయ్యింది. దీంతో గవర్నర్ కార్యాలయం ముందు వరుసగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గొర్రెల మందతో కొందరు నిరసన చేపట్టడంపై రాష్ట్ర గవర్నర్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా రాజ్భవన్ వద్ద శాంతిభద్రతలు క్షీణించడం, వీటిని నిరోధించడంలో పోలీసుల వైఫల్యంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు.
‘రాష్ట్రంలో శాంతి భద్రతలే కాదు, రాజ్భవన్ ప్రవేశ ద్వారం వద్ద జరుగుతున్న ఘటనలు ఆందోళనకరంగా ఉన్నాయి. నిషేధాజ్ఞలు అమలులో ఉన్న ప్రాంతంలో నిరసన కార్యక్రమాలను అనుమతించడంపై పోలీసుల తీరు బాధాకరం. కట్టుదిట్టమైన భద్రత ఉండే రాజ్భవన్ ముందు కొన్ని రోజులుగా వరుసగా జరుగుతున్న వికృత చేష్ఠలు ఆందోళకరం’ అని గవర్నర్ జగదీప్ ధన్కడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా భారీ సంఖ్యలో పోలీసులు ఉన్నప్పటికీ వీటిని అడ్డుకోకుండా చూస్తూ ఊరుకోవడంతో పాటు రాజ్భవన్ శాంతి భద్రతల విషయంలోనూ పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఈ పరిణామాలపై వెంటనే వివరణ ఇవ్వాలని కోల్కతా పోలీస్ కమిషనర్ను గవర్నర్ ఆదేశించారు.
ఇదిలాఉంటే, నారదా కుంభకోణం కేసులో ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే సహా మాజీ మంత్రిని సీబీఐ అరెస్టు చేసింది. వీరిపై విచారణ జరిపేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తృణమూల్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా రెండు రోజులుగా రాజ్భవన్ ముందు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో పలుచోట్ల హింస చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దేశంలో సురక్షితమైన సీటు లేదని, భవిష్యత్తులో ఆయన మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
కేరళలోని వయనాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, భాజపాపై విమర్శలు గుప్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!