Prudhvi Raj: ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూసి ఉండం.. మాధవ్ వీడియోపై పృథ్వీరాజ్ కామెంట్
హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై సినీ నటుడు పృథ్వీరాజ్ స్పందించారు. అంగబలం, అర్ధబలం ఉండటంతోనే గోరంట్ల మాధవ్ను వెనకేసుకొస్తున్నారని
విశాఖపట్నం: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై సినీ నటుడు పృథ్వీరాజ్ స్పందించారు. అంగబలం, అర్ధబలం ఉండటంతోనే గోరంట్ల మాధవ్ను వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. ‘‘ఈనెల 4న బయటపడిన ఆ దరిద్రపు వీడియోకి సంబంధించి ఎంపీ మాధవ్ వాడిన భాష ఆ పార్టీ నేతలకు బాగా నచ్చినట్టుంది. ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూసి ఉండం. పార్లమెంట్లో తెలుగు ఎంపీలకు ఒక మంచి చరిత్ర ఉంది. ఇప్పుడు గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంతో అంతా తుడిచిపెట్టుకు పోయింది. పృథ్వీ వ్యవహారంలో వారంపాటు ఖాళీలేకుండా ప్రెస్మీట్లు పెట్టిన ఆ పార్టీ నేతలు ఇప్పుడేమయ్యారు. అనంతపురం ఎస్పీ చెబుతున్న విషయాలు ఒకదానికొకటి పొంతన లేవు. చివరకు ఫేక్ అని తేల్చేశారు. కానీ, ప్రజలు ఆ మాత్రం అవగతం చేసుకోకుండా ఉండరు’’ అని పృథ్వీ అన్నారు.
ఎంపీ గోరంట్ల మాధవ్కు సంబంధించినదిగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో ఒరిజనల్ కాదని అనంతపురం జిల్లా ఎస్పీ కె.ఫక్కీరప్ప నిన్న మీడియా సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే. ఎడిటింగ్ లేదా మార్ఫింగ్ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఒరిజినల్ ఉంటేనే ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించి, మార్ఫింగా.. కాదా? అనేది తేల్చగలమని అన్నారు. దీంతో ఎంపీ గోరంట్లను ఎస్పీ వెనకేసు కొస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి