Punjab Polls: సోనూసూద్ సోదరికి టికెట్.. కాంగ్రెస్కు ఆ ఎమ్మెల్యే షాక్!
మరికొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నవేళ పంజాబ్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కాంగ్రెస్లో చేరిన సినీ నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ను......
చండీగఢ్: మరికొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ పంజాబ్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కాంగ్రెస్లో చేరిన సినీ నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ను మోగ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దించడం పట్ల ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే డా.హర్జోత్ కమల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె కోసం మోగ స్థానం నుంచి తప్పుకొన్న ఆయన.. తాజాగా కాంగ్రెస్కు షాక్ ఇచ్చారు. ‘హస్తం’ పార్టీకి గుడ్బై చెప్పి భాజపాలో గూటికి చేరారు. చండీగఢ్లోని భాజపా కార్యాలయానికి వెళ్లిన హర్జోత్ కమల్.. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, మీనాక్షి లేఖి సహా పలువురు భాజపా కీలక నేతల సమక్షంలో కాషాయ దళంలోకి చేరడం గమనార్హం. ఇటీవల మాళవిక సూద్ కాంగ్రెస్లో చేరిన సందర్భంలో ఏర్పాటు చేసిన సభకు కూడా హర్జోత్ హాజరుకాలేదు. ఆయన గైర్హాజరుపై పీసీసీ చీఫ్ నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ స్పందిస్తూ.. హర్జోత్ తనకు వ్యక్తిగతమైన స్నేహితుడిగా పేర్కొన్నారు. పంజాబ్లో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనుండగా.. ఈరోజు 86మంది అభ్యర్థుల పేర్లతో కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్