Punjab Politics: సీఎల్పీ కాదు.. పంజాబ్ సీఎంను సోనియానే నిర్ణయిస్తారు!
పంజాబ్ కొత్త సీఎం ఎంపికకు నేడు శాసనసభాపక్షం భేటీ కావాల్సి ఉండగా.. అది వాయిదా పడింది. పార్టీ అధిష్ఠానమే ముఖ్యమంత్రి పేరును ఖరారు చేయనున్నట్లు సమాచారం....
చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ రాజీనామా చేయడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా కొత్త సీఎం ఎంపికకు నేడు శాసనసభాపక్షం భేటీ కావాల్సి ఉండగా.. అది వాయిదా పడింది. పార్టీ అధిష్ఠానమే ముఖ్యమంత్రి పేరును ఖరారు చేయనున్నట్లు సమాచారం. దీనిపై ఎమ్మెల్యే పర్గాత్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘సీఎం ఎంపిక అధినాయకత్వం చేతిలో ఉంది. నిన్ననే సీఎల్పీ భేటీ జరిగింది. మా అభిప్రాయాన్ని అప్పుడే చెప్పాం’’ అని పేర్కొన్నారు.
ఈ విషయంపై పంజాబ్ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పవన్ గోయెల్ మాట్లాడుతూ.. ‘‘కేంద్ర పరిశీలకులు అజయ్ మాకెన్, హరీశ్ రావత్తో శనివారం భేటీ అయ్యాం. అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తీర్మానించాం. ఆమె నిర్ణయం ఈరోజు తెలుస్తుంది’’ అని తెలిపారు.
సీఎం రేసులో ముందున్న ముగ్గురిలో ఒకరైన సునీల్ జాఖడ్ పేరును పలువురు మంత్రులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా మంది ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అయితే, మరికొంత మంది కూడా సీఎం పీఠంపై ఆసక్తి కనబరుస్తుండడంతో.. అధిష్ఠానం ఉపముఖ్యమంత్రి పదవులను కూడా తెరపైకి తెచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరోవైపు పంజాబ్ పరిణామాలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ స్పందించారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీకి నష్టం కలిగించే పని చేయబోరని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనొక గౌరవప్రదమైన వ్యక్తి అని.. భవిష్యత్తులోనూ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తారని ఆశిస్తున్నానన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రంలో భాజపాకు రెండంకెల స్థానాలు ఖాయం: కె.లక్ష్మణ్
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో భాజపాకు రెండంకెల స్థానాలు ఖాయమని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. -
కేసీఆర్దే లిల్లీపుట్ మనస్తత్వం: మల్లు రవి
అప్పుడప్పుడు లిల్లీపుట్లకు కూడా అధికారం వస్తుందని మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. -
పార్లమెంటు నియోజకవర్గాలకు కిసాన్ కాంగ్రెస్ ఇన్ఛార్జుల నియామకం
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్రంలో సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజిగిరి మినహా మిగతా 14 పార్లమెంటు నియోజకవర్గాలకు జోనల్, నియోజకవర్గ ఇన్ఛార్జులను నియమించింది. -
19, 24 తేదీల్లో ఉమ్మడి వరంగల్లో సీఎం ఎన్నికల ప్రచారం
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 19, 24 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. -
ప్రభుత్వాన్ని టచ్ చేస్తే.. తెలంగాణభవన్ పునాదులు లేకుండా చేస్తాం
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలనే భావనతో.. పార్టీని టచ్ చేయాలని చూస్తే హైదరాబాద్లో భారాస కార్యాలయం తెలంగాణభవన్ పునాదులు లేకుండా చేస్తామని రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హెచ్చరించారు. -
ప్రజలకు తాగునీరైనా ఇవ్వండి
పంటలకు సాగునీళ్లు ఎలాగూ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలకు కనీసం గొంతు తడుపుకోవడానికి మంచినీళ్లయినా ఇవ్వాలని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
సార్వత్రిక సవాల్..
సార్వత్రిక ఎన్నికల సమరానికి రాష్ట్రం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల అనంతరం మరో ప్రతిష్ఠాత్మక పోరుకు తెరలేస్తోంది. -
బ్యాలెట్తో ఎన్నికలంటే భాజపాకు భయమెందుకు?
ప్రపంచవ్యాప్తంగా బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయని, మనదేశంలో బ్యాలెట్ ఎన్నికలంటే భాజపాకు, ప్రధాని మోదీకి భయమెందుకని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. -
నామినేషన్లకు వేళాయె..
రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. -
అడ్డంకులు లేకుండా నామినేషన్ల ప్రక్రియ
లోక్సభ ఎన్నికల్లో భాగంగా గురువారం ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియను ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) వికాస్రాజ్ ఆదేశించారు. -
కాంగ్రెస్లో వలసల ప్రభావమెంత?
కాంగ్రెస్లోకి కొనసాగుతున్న భారీ వలసలు లోక్సభ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది చర్చనీయాంశంగా మారింది. -
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దేశంలో సురక్షితమైన సీటు లేదని, భవిష్యత్తులో ఆయన మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
కేరళలోని వయనాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, భాజపాపై విమర్శలు గుప్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!