50వేల మంది నిరాశ్రయులయ్యారు: పవన్
గోదావరి ముంపు ప్రాంతాల ప్రజల బాధలు ఆవేదన కలిగిస్తున్నాయని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పసిపిల్లలకు పాలు కూడా దొరకడం లేదన్నారు.
అమరావతి: గోదావరి ముంపు ప్రాంతాల ప్రజల బాధలు ఆవేదన కలిగిస్తున్నాయని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పసిపిల్లలకు పాలు కూడా దొరకడం లేదన్నారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగుపరిచి సరైన వైద్యం అందించాలని పవన్ డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ముంపు ఇంతలా ఉండేది కాదన్న ఆయన త్వరితగతిన ప్రాజెక్టు పనులు చేయాలని కోరారు.
200 లంక గ్రామాలు మునిగిపోయాయని పవన్కల్యాణ్ వివరించారు. దీంతో 50వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని తెలిపారు. వైద్యులు అందుబాటులో లేరని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో చిన్న పిల్లలు పాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అత్యవసర వస్తువుల జాబితాలో పాలు కూడా చేర్చాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?