అమరావతి కన్నీటి వెతలు ఇంకెన్నాళ్లు?
ఏపీ రాజధాని అమరావతి కోసం ఎంత ఖర్చుచేశారో పూర్తి వివరాలు సమర్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించండం మంచి పరిణామమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు...
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు
దిల్లీ : ఏపీ రాజధాని అమరావతి కోసం ఎంత ఖర్చుచేశారో పూర్తి వివరాలు సమర్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించండం మంచి పరిణామమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. శుక్రవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొందరు నేతలు హైకోర్టుపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని, సంయమనం పాటించాలని సీఎం కోరితే బాగుంటుందన్నారు.
‘‘ఒక మాజీ న్యాయాధికారి సంభాషణలు బయటకు వచ్చాయి...అలాంటి వ్యాఖ్యలు ప్రభుత్వానికి మంచిది కాదు. న్యాయస్థానాలను అందరూ గౌరవించాలి. రాజధానిపై సోము వీర్రాజు చేసిన కామెంట్ సరైంది కాదు. అమరావతిలో రాజధాని వస్తుందని సామాన్య, మధ్యతరగతి ప్రజలు చాలా మంది చిన్న చిన్న ఫ్లాట్స్ కొనుక్కున్నారు. దయచేసి వారికి ఇబ్బంది కలిగించొద్దు. సీఎం జగన్ ఒక్కసారి ఇలాంటి విషయాలపై కూడా ఆలోచించాలి. ఐఏఎస్, ఐపీఎస్లు కూడా అమరావతిలో స్థలాలు కొనుక్కున్నారు.. ప్రస్తుతం ఏపీలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో రాజధాని మార్పు సరికాదు. రైతులకు న్యాయం చేయాలంటే రూ.80వేల కోట్లు అవసరం. రాజధాని తరలించి రైతులకు ఏవిధంగా న్యాయం చేయగలరు. అమరావతి కన్నీటి వెతలు ఇంకెన్నాళ్లు? రాజధాని లేకుండా రైతుల కష్టాలు ఎలా తీరుస్తారు?’’ అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్: కేటీఆర్
అన్నివర్గాల ప్రజలకు, యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కపటనీతికి మారు పేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. -
కాంగ్రెస్లోకి మరో భారాస ఎమ్మెల్యే!
మరో భారాస ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి రాజకీయ పార్టీల మధ్య ఒకవైపు వాదోపవాదాలు జరుగుతుండగా, మరోవైపు రాజేంద్రనగర్ భారాస ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సంక్షిప్త వార్తలు
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఏకైక డిమాండ్తో యుగతులసి పార్టీ జాతీయ అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. -
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం