Raghunandan Rao: పేపర్ లీకేజీతో సంబంధం లేకుంటే కేటీఆర్ ఎందుకు స్పందించారు?: రఘునందన్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆరే బాధ్యత వహించాలని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏ కంప్యూటర్ హ్యాక్ అయినా ఐటీ శాఖ మంత్రే నైతిక బాధ్యత వహించాలన్నారు.
హైదరాబాద్: ఎన్నికల నామ సంవత్సరం కాబట్టే.. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతన్నలపై ప్రేమ చూపిస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేటీఆరే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. నీతి వాక్యాలు చెప్పే కేటీఆర్.. లాల్ బహదూర్ శాస్త్రిని ఎందుకు ఆదర్శంగా తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ కంప్యూటర్ హ్యాక్ అయినా ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆరే నైతిక బాధ్యత వహించాలన్నారు. ఈ మేరకు భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తండ్రి మాదిరి.. కుమారుడికి కూడా జర్నలిస్టులను తిట్టడం అలవాటుగా మారిందని రఘునందన్ దుయ్యబట్టారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో సంబంధం లేకుంటే ఆ వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి మాట్లాడకుండా కేటీఆర్ ఎందుకు స్పందించారని ప్రశ్నించారు. రాజు తర్వాత యువరాజుగా ఫీల్ అవుతున్నాడు కాబట్టే.. కేటీఆర్ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నిండు సభలో కౌలు లేదు.. కౌలు రైతు లేడన్న కేసీఆర్కు ఎన్నికలు రాగానే కౌలు రైతులు గుర్తొచ్చారా? అని ప్రశ్నించారు. అటెన్షన్ డైవర్షన్ స్కీంలో భాగమే కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తున్నారని రఘునందన్ విమర్శించారు. నిజంగా రైతులను ప్రభుత్వం ఆదుకుంటామంటే భాజపా స్వాగతిస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య ఎంతో వ్యవసాయశాఖ కమిషనర్ శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరు ఎకరాలు దాటిన రైతులకు ఈ ఏడాది రైతుబంధు రాలేదని రఘునందన్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్