AP News: ‘నా హత్యకు కుట్ర జరుగుతోంది’: రఘురామకృష్ణరాజు
జార్ఖండ్కు చెందిన వ్యక్తులతో తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు.
దిల్లీ: జార్ఖండ్కు చెందిన వ్యక్తులతో తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... దీనిపై అన్ని వివరాలతో ప్రధానమంత్రికి లేఖ రాయనున్నట్టు చెప్పారు. ‘‘గుంటూరు జిల్లాలో తెదేపా నేతను దారుణంగా హత్య చేశారు. సీఎం జగన్కు రాష్ట్రంలో వ్యవస్థ నచ్చకపోతే వ్యవస్థను, వ్యక్తి నచ్చకపోతే వ్యక్తిని తీసేస్తారు. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్పై నేను ఇచ్చిన ప్రివిలేజ్ పిటిషన్ పై బండి సంజయ్ వ్యవహారంలో స్పందించినంత వేగంగా స్పందించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేస్తున్నా. జగనన్న గోరుముద్ద పథకం ఇకపై రాష్ట్రంలో కొనసాగదు. ఈ విషయమై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ నేను రాసిన లేఖకు స్పందించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇక రాష్ట్రంలో జగనన్న పథకాలను కొనసాగించలేరు. పోలీసు వ్యవస్థను ప్రతిపక్ష నేతలను వేధించేందుకు, కేసులు పెట్టేందుకే వినియోగిస్తున్నారు. చిరంజీవిని అల్లరి చేయించడానికి ఆయనకు రాజ్యసభ అవకాశం ఇస్తున్నట్టు ఓ పత్రికలో కథనం రాయించారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే పని అన్నయ్యగా చిరంజీవి చెయ్యరు. చిరంజీవి చెప్పకపోతే ముఖ్యమంత్రికి సినిమా కష్టాలు తెలియవా? ప్రభుత్వంపై పోరాడుతున్న పవన్ కల్యాణ్ కు చిరంజీవి మద్దతు ఇవ్వాలి. ఇకపై సీఎం విందుకు చిరంజీవి వెళ్లాల్సిన అవసరం లేదు. సీఎం అయినంత మాత్రాన 3 రూపాయలకు సినిమా చూపిస్తాను అంటే కుదరదు. సినిమా రంగానికి అన్యాయం చేస్తే న్యాయం చేయడానికి కోర్టులు ఉన్నాయి’’ అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామీ గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్