రాష్ట్రపతిని కలిసిన రఘురామకృష్ణరాజు
అమరావతిని పరిపాలనా రాజధానిగా కొనసాగించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కోరినట్టు నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు
దిల్లీ: అమరావతిని పరిపాలనా రాజధానిగా కొనసాగించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కోరినట్టు నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ లాంటి న్యాయ కోవిదుల సలహా తీసుకుని రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై ఏపీ గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సూచించాలని రాష్ట్రపతికి వినతిపత్రం ఇచ్చినట్లు పేర్కొన్నారు. పార్లమెంట్లో తెలుగు భాషపై మాట్లాడినందుకు తనకు వైకాపా నోటీసు ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘నా పైన మా ప్రభుత్వానికి కోపం వచ్చింది. నాపై దాడికి మా ప్రభుత్వమే ఉసిగొల్పుతోంది. వైకాపా నేతలు పార్టీకి, ప్రభుత్వానికి తేడాను గమనించడం లేదు. ఎమ్మెల్యేలు, కార్యకర్తల నుంచి ముప్పు ఉందన్న విషయాన్ని రాష్ట్రపతికి తెలిపాను. ప్రజల డబ్బుతో రాజధాని కడుతున్నారు.. ఎవరూ భయపడవద్దు. తప్పు జరిగితే ప్రశ్నించండి. అమరావతి కోసం అందరం కష్టపడదాం. రైతులకు న్యాయం చేద్దాం. కులాలకు అతీతంగా మనం ముందుకు వెళ్ళాలి. రాజధానిలో అన్ని కులాల వారు భూములు ఇచ్చారు. వైసీపీ పార్టీ పై ఎవరైనా బురద జల్లితే తుడిచే పనిలో నేనున్నాను.’’ అని రఘురామకృష్ణరాజు మీడియాతో తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన పూర్తి సమాచారం రాష్ట్రపతి దగ్గర ఉందని, రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నాని ఆయన చెప్పారు.
అనంతరం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తోనూ రఘురామకృష్ణరాజు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తనపై పత్రికల్లో వస్తున్న వార్తలను చూసి బాగోగులు అడిగారని ఎంపీ తెలిపారు. అంతేకాకుండా తన భద్రత అంశంపై మంత్రితో చర్చించానని చెప్పారు. త్వరలో మరికొంత మంది మంత్రులను కూడా కలుస్తానని ఎంపీ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట