రాజధానికై పోరాటం చేయాల్సిన అవసరముంది
ఏపీ రాజధానిపై రాజీలేని పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఏపీలో రాజధాని వికేంద్రీకరణ బిల్లు గవర్నర్ ఆమోదం పొందిన నేపథ్యంలో ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాజధాని విషయంలో ప్రజల అభిప్రాయాలు
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు
దిల్లీ: ఏపీ రాజధాని విషయంలో రాజీలేని పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఏపీలో రాజధాని వికేంద్రీకరణ బిల్లు గవర్నర్ ఆమోదం పొందిన నేపథ్యంలో ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాజధాని విషయంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకున్నా మంచిదేన్నారు. మూడు రాజధానులు నిర్మించడం సాధ్యమేనా అని ఆలోచించాలని రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని కోరారు.
‘‘అమరావతి రాజధానిని కాపాడుకునే పోరాటాన్ని మహిళలే ముందుండి నడపాలి. మహిళా నాయకత్వానికి మచ్చుతునకలైన రాణిరుద్రమ, అబ్బక్క వంటి వీర నారీమణులే స్ఫూర్తిగా మీరు ముందుకు సాగండి. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో రైతులను దగా చేసే ప్రయత్నం జరుగుతోంది. సీఆర్డీఏ ద్వారా రైతులకు వచ్చిన అధికారాన్ని కాల రాసేందుకు ప్రభుత్వమే కుట్ర పన్నుతోంది. ప్రభుత్వం చేసిన కొత్త చట్టసవరణ ద్వారా రైతులకు దక్కేదేమి లేదు. కొత్త రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో కూడా స్పష్టంగా ఉంది. సెక్షన్ 94(3) ద్వారా ఒకే రాజధానిలో రాజ్భవన్, హైకోర్టు, అసెంబ్లీ వంటి భవనాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని స్పష్టంగా ఉంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది’’అని రఘురామకృష్ణరాజు తెలిపారు.
రాజీలేని పోరాటం అవసరం
కృష్ణా, గుంటూరు జిల్లాల తెదేపా, వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేయడంపై వైకాపా ఎంపీ స్పందించారు. రాజీనామా చేయడం కంటే రాజీలేని పోరాటం చేయడం అవసరమని పవన్ కల్యాణ్ గుర్తించాలన్నారు. బీటెక్ రవి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆలోచన మానుకొని ప్రత్యక్ష పోరాటానికి దిగాలని సూచిస్తున్నట్లు తెలిపారు.
‘‘సీఎం గారూ.. సాక్షిని కాకుండా మనస్సాక్షిని నమ్మండి. రిఫరెండం పెట్టి ప్రజల ఆలోచన తెలుసుకోండి. ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య పింఛన్ల రూ. 250 పెంచేందుకు మన దగ్గర డబ్బు లేనప్పుడు రూ.వేల కోట్లతో మూడు రాజధానుల నిర్మాణం ఎలా సాధ్యమవుతుంది? కేవలం సంక్షేమ పథకాలు నమ్మి మనకు ఓట్లు వస్తాయని భ్రమించి ప్రజాభిష్టాన్ని నిర్లక్ష్యం చేయకండి. విలువలకు కట్టుబడి నేను రాజీనామా చేయాలని కోరుతున్న వైకాపా నేతలు.. అదే విలువల కోసం మొత్తం ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధపడతారా?’’అని ఎంపీ రాఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.
ఆత్మహత్యలు చేసుకోవద్దు
రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఆందోళనకు గురికావొద్దని ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. తాడేపల్లిలో సీఎం జగన్ ఉన్నారని, విజ్ఞప్తి పత్రాలతో సీఎం దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందన్నారు. తనకు సెక్యూరిటీ వచ్చిన తర్వాత అమరావతి వెళ్లి మహిళలు, రైతుల వెనక ఉండి పోరాటం చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో నాలుగు జోన్లు ఏర్పాటు చేస్తామన్న మేరకు ముందుకు వెళ్తే అభివృద్ధి సాధ్యం కానీ.. మూడు రాజధానుల వల్ల సాధ్యం కాదన్నారు. 151 స్థానాలు గెలుచుకున్న వైకాపా నేతలు రాజీనామా చేసి ప్రజల వద్దకు రిఫరెండం కోసం వెళ్తే మొత్తం 175 స్థానాలు గెలుచుకోవచ్చు కదా అని సూచించారు. ఇది ప్రభుత్వానికి, సీఎంకు తాను ఇచ్చే సూచనే తప్ప.. పార్టీకీ, పార్టీ అధ్యక్షుడికి కాదని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూమా అఖిలప్రియను అడ్డుకున్న వైకాపా నేతలు.. యర్రగుంట్లలో ఉద్రిక్తత
మాజీ మంత్రి, ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియను వైకాపా నేతలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. -
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. -
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. -
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!
Congress: కంగనా రనౌత్పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ తాజా లోక్సభ అభ్యర్థుల జాబితా నుంచి తప్పించింది. -
ఇంటికి కిలో బంగారం పంచినా జగన్కు ఓటమే
అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్ను తాడేపల్లి ప్యాలెస్లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
నగదు, మద్యం దొరికినా అధికారులు స్పందించరేం?
తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్లు దొరికినా.. జిల్లా కలెక్టర్, ఆర్వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం
ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. -
రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
ముందు చెల్లికి సమాధానం చెప్పాలి
బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్... బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిని వెంట బెట్టుకుని బయటకొచ్చారని, అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోక పోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకూ అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. -
రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డికి అసమ్మతి సెగ
‘పరిటాల కుటుంబంతో పోరాటం అన్నది నా ఒక్కడితో సాధ్యం కాదు.. ఇప్పటికే ఒకసారి ఓడిపోయి ఇల్లు అమ్ముకొని రోడ్డున పడ్డానని ప్రకాశ్రెడ్డి అంటే ఆయనను ఇంట్లో కూర్చోబెట్టాం..మమ్మల్ని మాత్రం ఆయన రోడ్డున పడేశారు. -
మట్టి మింగేస్తున్నారు.. మనుషుల్ని చంపేస్తున్నారు
‘వైకాపా పాలనలో అక్రమ తవ్వకాలతో మట్టిని మింగేస్తున్నారు.. ప్రశ్నించిన మనుషులనూ చంపేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. -
పవన్కల్యాణ్తో నాయకుల సమావేశం
ఒంగోలు ఎంపీ, తెదేపా నేత మాగుంట శ్రీనివాసులురెడ్డి.. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్తో భేటీ అయ్యారు. -
తెలిసే.. వదిలేశారా?
అధికార వైకాపా తాయిలాల పంపిణీలో దూసుకుపోతుంటే తిరుపతి జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్టీల ఉమ్మడి భేటీలు
ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 4న లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో, 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించాలని తెదేపా, జనసేన, భాజపా నిర్ణయించాయి. -
కేసుల్లోనూ నంబర్ వన్ ముఖ్యమంత్రి జగనే
దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోకెల్లా ధనవంతుడైన జగన్.. కేసుల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నేత దీపక్రెడ్డి ఎద్దేవా చేశారు. -
అనంతపురం జిల్లాలో ఘోరం..
అనంతపురం జిల్లా శింగనమల మండల వైకాపా మాజీ కన్వీనర్, అసమ్మతి నాయకుడు పట్నం నగేశ్ మామిడి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. -
భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే
రాష్ట్రంలో పోటీ చేయనున్న పది అసెంబ్లీ స్థానాలకు భాజపా అధినాయకత్వం బుధవారం అభ్యర్థుల్ని ప్రకటించింది. వీరిలో సుజనాచౌదరికి కేంద్ర మంత్రిగా, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డిలకు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించిన అనుభవం ఉంది. -
క్యాష్ కొట్టు.. బస్సులు పట్టు
ఇటీవల వైకాపా నిర్వహించిన నాలుగు సిద్ధం సభలకు 8,700 ఆర్టీసీ బస్సులు తీసుకున్నారు. వీటికి ఆ పార్టీ దాదాపు రూ.20 కోట్ల వరకు చెల్లించింది. -
భాజపా లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జుల నియామకం
రాష్ట్రంలో భాజపా పోటీ చేస్తున్న లోక్సభ స్థానాలకు సీనియర్ నేతలను ఇన్ఛార్జులుగా ఆ పార్టీ నియమించింది. వీరిలో నలుగురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. -
డబ్బు తరలించడానికే ఆ కంటెయినర్
అయిదేళ్లుగా అడ్డదారిన ఆర్జించిన రూ.వేల కోట్ల సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటెయినర్లో తరలించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైకాపా అభ్యర్థులకు పంచడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే