Raghurama: ఆ జాబితాలో నా పేరు లేదు.. పర్యటనకు రాలేను: మోదీకి రఘురామ లేఖ

ప్రధాని నరేంద్రమోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆయనకు లేఖ రాశారు.

Updated : 04 Jul 2022 10:46 IST

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆయనకు లేఖ రాశారు. ప్రధాని భీమవరం పర్యటన జాబితాలో తన పేరు లేకపోవడంపై ఫిర్యాదు చేశారు. స్థానిక ఎంపీగా ఉన్న తన పేరును అధికారులు ఆ జాబితాలో చేర్చలేదని.. తన పేరు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందని రఘురామ పేర్కొన్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం ప్రధానిని స్థానిక ఎంపీ ఆహ్వానించాలన్నారు. కానీ తనకు ఆహ్వానం లేకపోవడంతో ఆ కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నట్లు వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని